News September 20, 2025
విజయనగరంలో దంపతుల ఆత్మహత్య

విజయనగరం వీటీ అగ్రహారంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అగ్రహారంలో నివాసముంటున్న కానూరి పార్వతి (55), సత్యనారాయణ(62) కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి ఇంట్లో పడుకున్నారు. ఉదయం ఎంతకీ లేవకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. వారు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక నిర్ధారణలో తేలింది.
Similar News
News September 20, 2025
పల్నాడు ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తాం: సీఎం

పల్నాడు ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. మాచర్లలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. పల్నాడుకు ఎంతో చరిత్ర ఉందన్నారు. పల్నాడు చరిత్ర భావితరాలకు తెలియవలసిన అవసరం ఉందన్నారు. పల్నాడు ఉత్సవాలకు నిధులు కేటాయిస్తామన్నారు. ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ను సీఎం ఆదేశించారు.
News September 20, 2025
ఉగ్ర కలకలం.. రాంచీలో ISIS రిక్రూట్మెంట్ శిబిరం

ఝార్ఖండ్లోని రాంచీలో ISIS ఉగ్రవాద రిక్రూట్మెంట్ శిబిరం బట్టబయలైంది. కొన్నిరోజుల కిందట ఈ నగరంలో అనుమానిత ఉగ్రవాది అష్రఫ్ డానిష్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి విచారణలో ఉగ్ర శిబిరం గురించి తెలియడంతో రైడ్ చేశారు. అక్కడ పెద్దఎత్తున బాంబు తయారీ పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.
News September 20, 2025
పొగాకు కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేస్తాం: కలెక్టర్

పర్చూరు మార్కెట్ యార్డ్లో కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా వారు పొగాకు రైతులతో మాట్లాడారు. పొగాకు కొనుగోలు ప్రక్రియ మందగిస్తుందని రైతులు తమ సమస్యలను వారికి తెలియజేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్, ఎమ్మెల్యే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.