News April 14, 2024

విజయనగరంలో భారీగా బంగారం పట్టివేత

image

ఎన్నికల సందర్భంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో విజయనగరం కన్యాకాపరమేశ్వరి ఆలయం దగ్గరలో నిన్న రాత్రి అన్నవరం ప్రాంతానికి చెందిన వ్యక్తి నుంచి భారీగా బంగారాన్ని 1టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో అతని వద్ద నుంచి 2.68 కేజీల బంగారు ఆభరణాలు, రూ.17,50,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పసిడి వ్యాపారస్థులకు సంభందించినదిగా పోలీసులు భావిస్తున్నారు.

Similar News

News September 27, 2025

పైడితల్లమ్మ పండగ ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు: SP

image

పైడితల్లి అమ్మవారి సినిమానోత్సవం ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అమ్మవారి దర్శనం, సినిమానోత్సవంలో సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా చర్యలు చేపట్టాలన్నారు. సినిమాను తిరిగే మార్గంలో ప్రెజర్ పాయింట్స్ వద్ద మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.

News September 26, 2025

సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు: కిమిడి

image

సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున తెలిపారు. శుక్రవారం ఉమ్మడి విజయనగరం జిల్లా డీసీఎంఎస్ జిల్లా మహాజన సభ డీసీఎంఎస్ ఛైర్మన్ గొంప కృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గోంప కృష్ణ మాట్లాడుతూ..డీసీఎంఎస్‌ను బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

News September 26, 2025

VZM: 126 పోలింగ్ కేంద్రాల్లో 1200 కంటే అధికంగా ఓటర్లు

image

పోలింగ్ కేంద్రాల హేతుబ‌ద్దీక‌ర‌ణ ప్ర‌క్రియ‌కు రాజ‌కీయ పార్టీల‌న్నీ స‌హ‌క‌రించాల‌ని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌.శ్రీ‌నివాస‌మూర్తి కోరారు. రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో విజయనరగరం కలెక్టరేట్‌లో శుక్రవారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. జిల్లాలో 126 పోలింగ్ కేంద్రాల్లో 1,200 కంటే ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్నారని తెలిపారు. 1200 కంటే ఎక్కువ ఉన్నచోట అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నారు.