News June 16, 2024
విజయనగరం: ఆశలన్నీ ఆమెపైనే..!
ఉమ్మడి జిల్లా నుంచి గతంలో ఇద్దరు గిరిజన శాఖమంత్రులుగా పనిచేసినప్పటకీ పలు గిరిశిఖర గ్రామాల్లో సమస్యలు వెంటాడుతున్నాయి. తాజాగా సాలూరు ఎమ్మెల్యే సంధ్యారాణికి అవకాశం రావడంతో సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరుతున్నారు. కురుపాం నియోజకవర్గంలో పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చెయ్యాలని, ఎస్.కోట, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల్లో రోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.
Similar News
News October 3, 2024
VZM: టెట్ ఎగ్జామ్కి వెళ్లే వారు ఇవి పాటించండి
ఈ రోజు నుంచి జరిగే టెట్ ఆన్లైన్ పరీక్షలకు అభ్యర్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి 30 నిమిషాలు ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. హాల్ టికెట్తో పాటు ఏదైనా ఒరిజినల్ ఐడీ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. వీహెచ్, పీహెచ్ అభ్యర్థులకు 50 నిమిషాలు అదనంగా సమయం కేటాయిస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాలతో రావడం నిషేధం.
News October 3, 2024
విజయనగరం: టెట్ ఆన్లైన్ పరీక్షా కేంద్రాలు ఇవే..
నేటి నుంచి ప్రారంభం కానున్న టెట్ పరీక్షలకు జిల్లాలో 22,979 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. పరీక్షల కోసం జిల్లాలో 5 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
⁍ స్వామి వివేకానంద ఇంజినీరింగ్ కళాశాల (కలవరాయి, బొబ్బిలి మండలం)
⁍ ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల
⁍ సత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(గాజులరేగ)
⁍ అయాన్ డిజిటల్ జోన్ (గాజులరేగ)
⁍ జొన్నాడ లెండీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 21 వరకు ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయి.
News October 3, 2024
దసరాకు ప్రత్యేక బస్ సర్వీసులు
దసరా సందర్భంగా విశాఖ నుంచి పలు ప్రాంతాలకు 250 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలరాజు తెలిపారు. ప్రత్యేక సర్వీసులకు ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవన్నారు. హైదరాబాద్కు 40, విజయవాడకు 40 నుంచి 50, రాజమండ్రి, కాకినాడ సెక్టార్కు 40 అదనపు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక సర్వీసులు నడుపుతామన్నారు.