News November 22, 2024
విజయనగరం: ఈ చిట్టితల్లి.. చిరంజీవి..!

గంటాడ్య మండలంలోని మురపాక గ్రామానికి చెందిన గండి వెంకటరమణ, దేవి దంపతుల చిన్న కుమార్తె పల్లవి(12) రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై, వెంటిలేటర్పై చికిత్స పొందుతోంది. బ్రెయిన్ డెడ్ కావడంతో ఇక బతికే అవకాశాలు లేవని వైద్యులు తేల్చేశారు. పుట్టెడు బాధలో ఉన్న ఆ దంపతులు.. తమ చిట్టితల్లి మరొకరికి ప్రాణదాత అవుతుందని భావించారు. కుమార్తె అవయవాలు దానం చేసేందుకు అంగీకరించి, మానవత్వాన్ని చాటుకున్నారు.
Similar News
News February 13, 2026
గంట్యాడ: పచ్చకామెర్లతో యువకుడి మృతి

గంట్యాడ మండలం కొండ తామరాపల్లి గ్రామానికి చెందిన యువకుడు పచ్చకామెర్లతో మృతి చెందాడు. కోన పవన్ కుమార్ (22) జ్వరం, పచ్చకామెర్లు రావడంతో 5 రోజుల క్రితం విజయనగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. పవన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్పై ఉన్న పవన్ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు.
News February 13, 2026
హ్యూమన్ రైట్స్ పేరుతో బెదిరింపులు చేస్తే జైలుకే: ఎస్పీ

హ్యూమన్ రైట్స్ కమిషన్, RTI ప్రతినిధులమని చెబుతూ మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ హెచ్చరించారు. గ్రామస్థాయిలో ఇటువంటి సంస్థలకు ఎటువంటి ప్రైవేట్ ప్రతినిధులు ఉండరని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా గుర్తింపు కార్డులు చూపి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.
News February 13, 2026
హ్యూమన్ రైట్స్ పేరుతో బెదిరింపులు చేస్తే జైలుకే: ఎస్పీ

హ్యూమన్ రైట్స్ కమిషన్, RTI ప్రతినిధులమని చెబుతూ మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ హెచ్చరించారు. గ్రామస్థాయిలో ఇటువంటి సంస్థలకు ఎటువంటి ప్రైవేట్ ప్రతినిధులు ఉండరని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా గుర్తింపు కార్డులు చూపి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.


