News April 21, 2024

విజయనగరం జిల్లాలో చంద్రబాబు సభ  

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 23న టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లాకు రానున్నారు. ఆరోజు ఉదయం బొండపల్లి మండలంలో మహిళా ప్రజాగళం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. సభకు బొండపల్లి జాతీయ రహదారి పక్కన గల మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ ప్రభాకర్, ఎస్.ఐలు లక్ష్మణరావు, మహేశ్ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. 

Similar News

News September 30, 2024

ప్రపంచంలోనే తొలి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ మన విజయనగరంలో..

image

ప్రపంచంలోనే తొలి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ విజయనగరంలో ఏర్పాటు అయింది. ప్రముఖ వ్యాపారవేత్త నరసింహమూర్తి కుటుంబ సభ్యులు ఆయన కోరిక మేరకు దీన్ని ఏర్పాటు చేశారు. ఈ రీసెర్చ్ సెంటర్లో రామాయణానికి సంబంధించిన 12వేల గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సంఖ్య లక్ష వరకు పెంచనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కేంద్రం రామాయణంపై పరిశోధనలకు, మానవత్వ విలువలను భావితరాలకు అందించేందుకు చక్కగా ఉపయోగపడుతుందని చెప్పారు.

News September 30, 2024

కురుపాంలో రోడ్డు ప్రమాద ఘటనలో UPDATE

image

కురుపాం మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. SI నీలకంఠరావు వివరాలు.. దొంబిడిలోని పాస్టర్ దుర్గారావు, భార్యతో కలిసి బైకుపై ప్రార్థనకు వెళ్తున్నారు. బి.శ్రీను, అతని స్నేహితుడికి ప్రకృతి అందాలు చూపించేందు బైకుపై వచ్చాడు. వారి ఇరువురి బైకులు ఎదురుగా వచ్చి బల్లేరుగూడ వద్ద ఢీకొన్నాయి. ఘటనలో శ్రీను, దుర్గారావు మృతి చెందారు.ఘటనపై SI కేసు నమోదు చేశామన్నారు.

News September 30, 2024

విజయనగరం: నేటి నుంచే పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు

image

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానుండగా, జిల్లాలో సందడి వాతావరణం మొదలైంది. ఇప్పటికే పైడితల్లి అమ్మవారి ఇరుసు, సిరిమాను వృక్షం హుకుంపేట చేరుకోగా.. ఆ వృక్షాన్ని మానుగా మలవనున్నారు. అక్టోబరు 30తో ఉత్సవాలు ముగియనుండగా.. 14న తొలేళ్లు, 15న సిరిమానోత్సవం జరగనున్నాయి. 22న తెప్పోత్సవం జరగనుందని, ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం సహాయ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు.