News April 18, 2024
విజయనగరం జిల్లాలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ
విజయనగరం జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. విజయనగరం పార్లమెంట్ స్థానానికి యుగ తులసి పార్టీ అభ్యర్థిగా శంబాన శ్రీనివాస రావు నామినేషన్ వేశారు.
జిల్లా ఎన్నికల అధికారి, విజయనగరం పార్లమెంటు రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను శ్రీనివాసరావు అందజేసారు. హెల్ప్ డెస్క్లో ముందుగా నామినేషన్ పత్రాలను ఏఆర్వో సుమబాల పరిశీలించారు.
Similar News
News October 11, 2024
VZM: 23న నర్సింగ్ అసోసియేషన్కు ఎన్నికలు
ఏపీ నర్సింగ్ అసోసియేషన్ విజయనగరం యూనిట్కు ఈ నెల 23న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రిజ్వాన్ షరీఫ్ తెలిపారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయ నోటీసు బోర్డులో వివరాలను ఉంచినట్లు వెల్లగించారు. ఇప్పటికే ఎన్నికలపై అందరికి అవగాహన కల్పించామన్నారు.
News October 10, 2024
చంద్రబాబును పైడితల్లి ఉత్సవాలకు ఆహ్వానించిన ఎంపీ కలిశెట్టి
అక్టోబర్ 13, 14, 15 తేదీల్లో విజయనగరంలో జరగనున్న ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి తొల్లేళ్లు, సినిమానోత్సవం నిర్వహించనున్నారు. కాగా ఉత్సవాలకు రావాలని సీఎం చంద్రబాబుకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆహ్వానించారు. వారితో పాటు ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఉన్నారు.
News October 10, 2024
దుర్గాదేవి అవతారంలో పైడితల్లి అమ్మవారు
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విజయనగరం వాసుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. రైల్వే స్టేషన్ వద్ద గల అమ్మవారి వనం గుడిలో దుర్గాష్టమి అర్చకులు దుర్గాదేవి అవతారంలో అమ్మవారిని అలంకరించి విశేష పూజలు, అర్చనలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.