News April 8, 2024

విజయనగరం: టీడీపీ పార్లమెంట్ సమన్వయ సమావేశం

image

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో అశోక్ గారి బంగ్లాలో ఎన్డీఏ కూటమి విజయనగరం పార్లమెంట్ సమన్వయ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఎన్నికలలో మూడు పార్టీల కలిసి సమన్వయంతో ఓటర్ల లిస్ట్ వెరిఫికేషన్, కొత్త ఓటర్లను గుర్తించడం, పోస్టల్ బ్యాలెట్, బూత్ ఏజెంట్లు మొదలగునవి, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కలిసి ప్రచారం చేయుటకు ప్రణాళికలు మొదలగు వాటిపై కలిసి చర్చించారు.

Similar News

News September 26, 2025

VZM: ‘GST తగ్గుదలపై ప్రజలకు అవగాహన కల్పించాలి’

image

ప్రభుత్వం తగ్గించిన GSTపై ప్రజలకు విస్తృత‌ అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎస్‌.రామ్‌ సుంద‌ర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఛీఫ్ సెక్ర‌ట‌రీ కె.విజ‌యానంద్ శుక్ర‌వారం స‌చివాల‌యం నుంచి క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటింటికి వెళ్లి జీఎస్టీ తగ్గింపు, తగ్గింపు వలన జ‌రిగే ఆదా గురించి ప్రజలకు వివరంగా తెలియజేయాలని ఆదేశించారు.

News September 26, 2025

పైడితల్లమ్మ పండగ సందర్భంగా ప్రత్యేక వైద్య శిబిరాలు

image

పైడితల్లమ్మ పండగ సందర్భంగా 6 ప్రాంతాల్లో, విజయనగరం ఉత్సవాల సందర్భంగా 15 ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి జీవనరాణి శుక్రవారం తెలిపారు. వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బందితో 3 షిప్టుల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగుతాయన్నారు. ఈ ప్రథమ చికిత్స వైద్య శిబిరాల సేవలను ప్రజలు, భక్తులు వినియోగించుకోవాలని ఆమె కోరారు.

News September 26, 2025

VZM: ‘పిల్లలకు ఇంటి నుంచే బాధ్యతలు నేర్పాలి’

image

పిల్లలకు ఇంటి నుంచే బాధ్యతలు నేర్పాలని, తల్లీదండ్రులే సంస్కారాన్ని నేర్పించి బయటకు పంపిస్తే చెడు పనులు చేయరని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శైలజ పేర్కొన్నారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో 8వ రాష్ట్రీయ పోషణ్ మాసోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఆడవారికి ఆపదలు పక్కనే పొంచి ఉంటాయని, తెలిసిన వారి నుంచే ఎక్కువ ముప్పు కలుగుతుందని అన్నారు. ఆడవారి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు.