News October 20, 2025

విజయనగరం: పలు గ్రామాలకు రాకపోకలు బంద్

image

మెంటాడ మండలంలోని ఆండ్ర జలాశయం నుంచి 400 క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో చంపావతి నది పొంగిపొర్లుతుంది. దీంతో జగన్నాథపురం, చాకివలస, ఆగూరు, మల్లేడివలస, గూడెం, సారాడవలస, గజపతినగరం మండలంలోని మర్రివలసకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాలకు బాహ్యప్రపంచంతో సత్సంబంధాలు తెగిపోయినట్లే. ఎవరికైనా ప్రాణాపాయమైతే రిస్క్ చేసి నది దాటడం, లేదా కిలోమీటర్ల దూరం పంటపొలాల్లో డోలీద్వారా రోగిని అష్టకష్టాలు పడి తరలించాలి.

Similar News

News October 20, 2025

దండారి ఉత్సవాల్లో పాల్గొన్న ఆదిలాబాద్ ఎంపీ

image

గిరిజనుల దండారి ఉత్సవాల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ పాల్గొన్నారు. ఆదిలాబాద్‌లోని కొమరం భీమ్ కాలనీలో సోమవారం వేడుకలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమమే దండారి ఉత్సవాలు అన్నారు. ఈ కార్యక్రమంలో తాటి పెళ్లి రాజు, కనపర్తి చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.

News October 20, 2025

HYD: రేపు దీపక్‌రెడ్డి నామిషన్‌ ర్యాలీకీ ప్రముఖులు

image

జూబ్లీహిల్స్ బైపోల్‌లో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. యూసఫ్‌గూడ హైలంకాలనీ నుంచి షేక్‌పేట్ తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఇప్పటికే గోవా సీఎం ప్రమోద్ హాజరుకానున్నట్టు ధ్రువీకరించగా, అస్సాం, మహారాష్ట్ర సీఎంల కన్ఫర్మేషన్ కోసం టీబీజేపీ వెయిటింగ్.

News October 20, 2025

రియాజ్ మృతిని ధ్రువీకరించిన DGP

image

TG: ఎన్‌కౌంటర్‌లో <<18056602>>రియాజ్<<>> మృతిని డీజీపీ శివధర్ రెడ్డి ధ్రువీకరించారు. ‘నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ ఇవాళ బాత్రూం కోసం వెళ్లి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. పోలీసుల నుంచి వెపన్ తీసుకుని రియాజ్ కాల్పులకు యత్నించాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ చనిపోయాడు’ అని డీజీపీ వెల్లడించారు.