News April 21, 2024
విజయనగరం: ముగిసిన మోడల్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్ష
విజయనగరం జిల్లాలో ఆదివారం 6వ తరగతి మోడల్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ముగిసిందని జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు. జిల్లాలో పలు పరీక్షా కేంద్రాలను డిఈఓ పరిశీలించారు. జిల్లాలో 14 సెంటర్లలో 3,669మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 3,167 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 502 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ పేర్కొన్నారు.
Similar News
News September 30, 2024
ప్రపంచంలోనే తొలి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ మన విజయనగరంలో..
ప్రపంచంలోనే తొలి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ విజయనగరంలో ఏర్పాటు అయింది. ప్రముఖ వ్యాపారవేత్త నరసింహమూర్తి కుటుంబ సభ్యులు ఆయన కోరిక మేరకు దీన్ని ఏర్పాటు చేశారు. ఈ రీసెర్చ్ సెంటర్లో రామాయణానికి సంబంధించిన 12వేల గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సంఖ్య లక్ష వరకు పెంచనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కేంద్రం రామాయణంపై పరిశోధనలకు, మానవత్వ విలువలను భావితరాలకు అందించేందుకు చక్కగా ఉపయోగపడుతుందని చెప్పారు.
News September 30, 2024
కురుపాంలో రోడ్డు ప్రమాద ఘటనలో UPDATE
కురుపాం మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. SI నీలకంఠరావు వివరాలు.. దొంబిడిలోని పాస్టర్ దుర్గారావు, భార్యతో కలిసి బైకుపై ప్రార్థనకు వెళ్తున్నారు. బి.శ్రీను, అతని స్నేహితుడికి ప్రకృతి అందాలు చూపించేందు బైకుపై వచ్చాడు. వారి ఇరువురి బైకులు ఎదురుగా వచ్చి బల్లేరుగూడ వద్ద ఢీకొన్నాయి. ఘటనలో శ్రీను, దుర్గారావు మృతి చెందారు.ఘటనపై SI కేసు నమోదు చేశామన్నారు.
News September 30, 2024
విజయనగరం: నేటి నుంచే పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానుండగా, జిల్లాలో సందడి వాతావరణం మొదలైంది. ఇప్పటికే పైడితల్లి అమ్మవారి ఇరుసు, సిరిమాను వృక్షం హుకుంపేట చేరుకోగా.. ఆ వృక్షాన్ని మానుగా మలవనున్నారు. అక్టోబరు 30తో ఉత్సవాలు ముగియనుండగా.. 14న తొలేళ్లు, 15న సిరిమానోత్సవం జరగనున్నాయి. 22న తెప్పోత్సవం జరగనుందని, ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం సహాయ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు.