News May 23, 2024

విజయనగరం: లిఫ్ట్ పేరుతో బంగారం గొలుసు చోరీ

image

పట్టణంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన నిందితుడిని 24 గంటల్లోనే అరెస్టు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ బి.వెంకటరావు తెలిపిన వివరాల మేరకు.. గాజులరేగకు చెందిన వెంకటేశ్ 21న ఆంజనేయస్వామి గుడివద్ద నిలబడ్డాడు. లంకాపట్నంకు చెందిన ఏసు లిఫ్ట్ ఇస్తానని నమ్మించి, చైన్ లాక్కోగా నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు. అతని వద్ద స్కూటీని, బంగారం గొలుసు రికవరీ చేసినట్లు చెప్పారు.

Similar News

News April 23, 2025

VZM: నేడే పది ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో..!

image

బుధవారం ఉ.10 గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించనున్నారు. విజయనగరం జిల్లాలో 2,359 పాఠశాలల నుంచి 23,765 మంది పరీక్ష రాయగా వారిలో 12,504 మంది బాలురు, 11,711 మంది బాలికలు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 22,930 మంది కాగా ప్రైవేట్‌గా 835 మంది పరీక్ష రాశారు. మొత్తం 119 సెంటర్లలో పరీక్షలను నిర్వహించారు. ఒక్క క్లిక్‌తో వే2న్యూస్‌లో ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. >Share it

News April 22, 2025

సివిల్స్‌లో 830వ ర్యాంక్ సాధించిన రాజాం యువకుడు

image

రాజాం మండలం సారధికి చెందిన వావిలపల్లి భార్గవ మంగళవారం విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 830వ ర్యాంక్ సాధించారు. నాలుగుసార్లు UPSC ఇంటర్వ్యూల వరకు వెళ్లి విఫలమైయారు. 5వ ప్రయత్నంలో సివిల్స్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖలో పిడుగురాళ్ల సర్కిల్ కమిషనర్‌గా భార్గవ పనిచేస్తున్నారు. ఇయన తండ్రి విష్ణు ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నారు.

News April 22, 2025

VZM: రేపే పది ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో..!

image

రేపు ఉ.10 గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించనున్నారు. విజయనగరం జిల్లాలో 2,359 పాఠశాలల నుంచి 23,765 మంది పరీక్ష రాయగా వారిలో 12,504 మంది బాలురు, 11,711 మంది బాలికలు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 22,930 మంది కాగా ప్రైవేట్‌గా 835 మంది పరీక్ష రాశారు. మొత్తం 119 సెంటర్లలో పరీక్షలను నిర్వహించారు. ఒక్క క్లిక్‌తో వే2న్యూస్‌లో ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. >Share it

error: Content is protected !!