News April 15, 2025
విజయనగరం వరకే గుంటూరు-రాయగడ ఎక్స్ప్రెస్

పార్వతీపురం-సీతానగరం లైన్లో ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్ల గమ్యాన్ని కుదించినట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ (17243/44) ఏప్రిల్ 21 నుంచి మే 3వరకు గుంటూరులో బయలుదేరి విశాఖ మీదగా విజయనగరం వరకే వస్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో రాయగడకు బదులుగా విజయనగరం నుంచి బయలుదేరి విశాఖ మీదగా గుంటూరు వెళ్తుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News November 5, 2025
కాసేపట్లో వర్షం..

తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కాసేపట్లో వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. అటు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమకు వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చాలా చోట్ల మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది.
News November 5, 2025
జేఎన్టీయూ-ఏ ఫార్మాడీ ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్టీయూ పరిధిలో సెప్టెంబర్లో నిర్వహించిన ఫార్మాడీ 3వ సంవత్సరం రెగ్యులర్, సప్లిమెంటరీ (ఆర్17), ప్రీ-పీహెచ్డీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివకుమార్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఫలితాల కోసం jntuaresults.ac.in వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు సూచించారు.
News November 5, 2025
10ఏళ్లలో 10 మంది కబడ్డీ ప్లేయర్ల హత్య

పంజాబ్లో కబడ్డీ ప్లేయర్ గుర్వీందర్ సింగ్ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపింది. శత్రువులందరికీ ఇదే తమ హెచ్చరిక అని SMలో పోస్టు చేసింది. ‘మీ దారులు మార్చుకోండి లేదా గుండెలో బుల్లెట్ దించుకోవడానికి రెడీగా ఉండండి’ అని పేర్కొంది. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు 2016 నుంచి డ్రగ్స్, గ్యాంగ్స్టర్స్, క్రైమ్తో సంబంధమున్న 10 మంది కబడ్డీ ప్లేయర్లు హత్యకు గురికావడం గమనార్హం.


