News June 24, 2024
విజయనగరం వైసీపీ కార్యాలయానికి నోటీసులు
విజయనగరం జిల్లా కేంద్రం రింగురోడ్డు సమీపంలోని మహరాజుపేట వద్ద నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయ భవనం అక్రమమని నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీచేశారు. వీఎంఆర్డీఏ అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొంటూ.. నిర్మాణ పనులు తక్షణం నిలుపు చేయాలని, వారం రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని పార్టీ ప్రతినిధులకు సూచించారు. కాగా సుమారు ఎకరా స్థలంలో ఇక్కడ వైసీపీ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది.
Similar News
News October 6, 2024
VZM: నేడు జిల్లాకు మంత్రి కొండపల్లి రాక
రాష్ట్ర చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎన్.ఆర్.ఐ.వ్యవహారాలు, సెర్ప్ శాఖల మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం జిల్లాకు వస్తున్నారు. మంత్రి ఉదయం 4.45 గంటలకు ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో నగరానికి చేరుకొంటారు. అనంతరం స్థానికంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి తెలిపారు. గజపతినగరం నియోజకవర్గంలో పర్యటిస్తారని వెల్లడించారు.
News October 6, 2024
విజయనగరం: TODAY TOP HEAD LINES
✮పార్వతీపురం: అర్ధరాత్రి ఏనుగుల గుంపు హల్చల్
✮విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు: కేంద్రమంత్రి
✮విజయనగరంలో ఈ నెల 8న జాబ్ మేళా
✮విజయనగరం: మాన్సాస్ ఆక్రమణల తొలగింపు
✮కురుపాం: ఆత్మహత్యాయత్నానికి కారణం భర్త అక్రమ సంబంధమే!
✮పెదపథంలో ఆరోగ్య ఉపకేంద్రం శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యారాణి
✮విశాఖ బీచ్లో నల్లటి ఇసుక వెనుక కారణం ఇదే..!
✮VZM: ప్రశాంతంగా ముగిసిన టెట్ పరీక్షలు
News October 6, 2024
న్యూతిన్ సూకియా, SMVT రైళ్లకు కొత్తవలసలో హాల్ట్
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైలు నంబర్స్ 05952 /05951 న్యూతిన్ సూకియా నుంచి ఎస్.ఎం.వి.టి బెంగళూరు ఈ నెల 7న, డిసెంబర్ 26 వరకు ప్రతి గురువారం సాయంత్రం 6.45 న్యూటిన్ సూకియాలో బయలుదేరి కొత్తవలస శనివారం మధ్యాహ్నం 2.05 చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఎస్.ఎం.వీ.టీ. బెంగళూరులో ఈనెల 11న, డిసెంబర్ 30 వరకు ప్రతి ఆదివారం అర్ధరాత్రి 00.30 బయలుదేరి సోమవారం రాత్రి 10.20 కొత్తవలస చేరుతుందని తెలిపారు.