News March 28, 2025
విజయనగరం: శ్రీ విశ్వావసునామ ఉగాది వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

శ్రీ విశ్వావసునామ ఉగాది వేడుకలను సంప్రదాయభద్దంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి కోరారు. ఉగాది వేడుకల నిర్వహణపై తమ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో గురువారం సమావేశమయ్యారు. రాష్ట్రప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కలెక్టర్ అంబేడ్కర్ సూచనల మేరకు ఈనెల 30వ తేదీన ఉగాది వేడుకలను కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
Similar News
News March 31, 2025
రంజాన్ మాసం అందిర జీవితంలో వెలుగులు నింపాలి: జడ్పీ ఛైర్మన్

పవిత్ర రంజాన్ సందర్భంగా అల్లాహ్ తన కరుణతో అందరినీ దీవించాలని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. అందరికీ ఆరోగ్యం, శ్రేయస్సు, ప్రశాంతత లభించాలని కోరారు. రంజాన్ మాసం జీవితాల్లో వెలుగు నింపాలనీ, ప్రేమ, శాంతి, సామరస్యాన్ని అందించాలనీ కోరారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో మన హృదయాలను శుద్ధి చేసుకోవాలని, విజయానికి మార్గం సుగమం కావాలని ఆయన అభిలషించారు.
News March 30, 2025
VZM: జిల్లాలో నేడు అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

జిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. శనివారం గుర్లలో 42.1°C నమోదైంది. ఇవాళ కూడా జిల్లా వ్యాప్తంగా వడగాలులు, ఉష్ణోగ్రతలు అధికంగా ఉండనున్నాయి. బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, చీపురుపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, గంట్యాడ, గరివిడి, గుర్ల, జామి, కొత్తవలస, ఎల్.కోట, మెంటాడ, మెరకముడిదాం, నెల్లిమర్ల, రాజాం, రామభద్రపురం, రేగిడి, ఎస్.కోట, తెర్లాం, వంగర మండలాల్లో దాదాపు 40°C నమోదవుతుందని APSDMA హెచ్చరించింది.
News March 30, 2025
డెంకాడ: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

డెంకాడ మండలంలోని శనివారం రాత్రి ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు బలంగా ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో విజయనగరంలోని గాంధీనగర్కు చెందిన నేమాల రవి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా మృతుడు సాప్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఉగాది రోజు ఆ ఇంట్లో విషాదం నెలకొంది.