News February 5, 2026
విజయభేరి మోగించిన పాలమూరు జట్టు

సీనియర్ ఉమెన్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ T-20టోర్నీలో ఆదిలాబాద్పై మహబూబ్నగర్ జట్టు సంచలన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ జట్టు 20 ఓవర్లలో 90/7 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మహబూబ్నగర్ జట్టు 10.2 ఓవర్లలో 91/0 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించి విజయ భేరి మోగించింది. అక్షర రాథోడ్-45*, ఆర్యాని-25* రన్స్ చేయగా అనిత, మేఘన చెరో 2 వికెట్లు తీశారు.
Similar News
News February 21, 2026
టెన్త్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యం: DEO

పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ పిలుపునిచ్చారు. శనివారం పోడూరులోని క్లస్టర్ కాంప్లెక్స్లను ఆయన ఆకస్మికంగా సందర్శించి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ప్రాథమిక స్థాయిలో అభ్యసనంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సూర్యనారాయణ, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
News February 21, 2026
రైతు బంధు నిధులు ఎక్కడ: హరీశ్ రావు

TG: రైతుబంధు పేరు చెప్పి ఓట్లు వేయించుకున్నారని, కానీ ఇంతవరకు నిధులు విడుదల చేయలేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రైతుబంధు ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటం చేస్తామన్నారు. సీఎం, వ్యవసాయశాఖ మంత్రి ఆఫీసులను ముట్టడిస్తామని చెప్పారు. అటు మెదక్ మున్సిపాలిటీలో BRS కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారని మండిపడ్డారు. పోలీసులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
News February 21, 2026
ఉమ్మడి మెదక్: ఏప్రిల్ 10 నుంచి SA-II పరీక్షలు

ఉమ్మడి మెదక్ జిల్లాలోని పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 10 నుంచి 20 వరకు సమ్మేటివ్–2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు సమగ్రంగా సన్నద్ధం కావాలని, ఉపాధ్యాయులు మార్గనిర్దేశనం చేయాలని సూచించారు.


