News July 5, 2025

విజయవాడలో ఆదిత్య ఫార్మసీ MD ఆత్మహత్య..!

image

విజయవాడ అయోధ్య నగర్‌లోని క్షత్రియ భవన్‌లో ఆదిత్య ఫార్మసీ కంపెనీ ఎండీ సాగి వెంకట నరసింహారాజు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక సమస్యలే కారణమని కుటుంబీకులు చెబుతున్నారు. సింగ్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

Similar News

News July 5, 2025

ఈ శతాబ్దపు అత్యుత్తమ మూవీ ‘పారాసైట్’: న్యూయార్క్ టైమ్స్

image

ఈ శతాబ్దంలోనే అత్యుత్తమ చిత్రంగా కొరియన్ మూవీ ‘పారాసైట్’ నిలిచింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకటించిన 21వ శతాబ్దంలోని టాప్-100 చిత్రాల్లో తొలి స్థానం దక్కించుకుంది. మూన్ లైట్, డార్క్ నైట్, వాల్-ఈ వంటి చిత్రాలతో పోటీ పడటం గమనార్హం. 2019లో రిలీజైన ‘పారాసైట్’కు నాలుగు ఆస్కార్ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం విభాగంలో అకాడమీ అవార్డు పొందిన నాన్-ఇంగ్లిష్ మూవీ ఇదే. మీరు ఈ మూవీ చూశారా?

News July 5, 2025

సాంకేతిక నైపుణ్యతలు పెంపొందించుకోవాలి: ఎస్పీ

image

ప్రతి ఒక్కరూ సాంకేతిక నైపుణ్యతను పెంపొందించుకునే విధంగా కృషి చేయాలని స్పెషల్ బ్రాంచ్ సిబ్బందికి శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సూచించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన విధులపై దిశానిర్దేశం చేశారు. ఫ్యాక్షన్ గ్రామాలలో గొడవలు జరగకుండా ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారాన్ని జిల్లా అధికారులకు తెలియజేయాలన్నారు. సిబ్బందికి లెదర్ బ్యాగులు పంపిణీ చేశారు.

News July 5, 2025

ఖమ్మం: పరీక్షల్లో ఫెయిల్.. బీటెక్ విద్యార్థి SUICIDE

image

పరీక్షలో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో బీటెక్ విద్యార్థి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముదిగొండ మండలంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మండలంలోని వల్లాపురానికి చెందిన ఇండేమందల యశ్వంత్(19) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల పరీక్షలు రాసి కిష్టాపురంలోని తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. పరీక్షలో ఫెయిల్ అవ్వడంతో మనస్తాపం చెంది బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.