News September 6, 2024
విజయవాడలో ఇప్పటికీ 1టీఎంసీ నీరు ఉంది: CM చంద్రబాబు

రానున్న రెండు మూడు రోజుల్లో విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టనున్న పనులను CM చంద్రబాబు వివరించారు. రేపటి నుంచి రేషన్ కిట్ల పంపిణీ, విద్యుత్, మంచినీటి సరఫరా చేస్తామని విజయవాడలో అన్నారు. అపార్ట్మెంట్లు, ఇళ్లలో ఉన్న నీటిని మోటార్లు పెట్టి తోడిస్తామని చెప్పారు. నగరంలో ఇంకా 1టీఎంసీ నీరు ఉన్నట్లు.. త్వరలోనే తోడుతామన్నారు. అనంతరం పారిశుద్ధ్య పనులు నిర్వహించి బ్లీచించ్ చేస్తామని చెప్పారు.
Similar News
News February 21, 2026
22న గన్నవరంలో జిల్లాస్థాయి జట్ల ఎంపికలు

కృష్ణాజిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటలకు గన్నవరం బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సీనియర్ స్త్రీ, పురుషుల టెన్నిస్ బాల్ క్రికెట్ జట్లను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారిని వచ్చే నెల 7న సంతనూతలపాడులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు కార్యనిర్వాహక కార్యదర్శి నరేంద్ర బాబు తెలిపారు. మరిన్ని వివరాలకు 94418 12694ను సంప్రదించాలన్నారు.
News February 20, 2026
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

* విజయవాడలో కూతురి పట్ల తండ్రి అసభ్య ప్రవర్తన
* చంద్రబాబును జైళ్లో వేయాలి: పేర్ని నాని
* విజయవాడలో ప్రమాదం.. ఒకరి మృతి
* పెనమలూరు: KTM పండుకు పీటీ వారెంట్
* బందరులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
* విజయవాడ బెంజి సర్కిల్లో చీకటి వ్యాపారం
News February 20, 2026
కృష్ణా: నిందితులపై పోలీసుల ఫోకస్..!

కృష్ణాజిల్లాలో కరుడుగట్టిన నేరస్తులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. SP విద్యాసాగర్ ఆదేశాల మేరకు నేరస్థుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. హత్యలు, అత్యాచారాలు, ఇతర నేరాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతంగా మారిన వారి పట్ల చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు వివరించారు. ఇటువంటి వారికి PT వారెంట్ల జారీకి కూడా వెనుకాడటం లేదని, తాజాగా పెనమలూరు PS పరిథిలోని నిందితుడు KTM పండుకు PT వారెంట్ జారీ చేశారన్నారు.


