News September 11, 2024
విజయవాడలో ‘ఉరుకు పటేల’ చిత్ర యూనిట్ సందడి
‘ఉరుకు పటేల’ చిత్ర యూనిట్ విజయవాడలో సందడి చేసింది. ఈ నెల 7న చిత్రం విడుదలై థియేటర్లలో విజయవంతంగా నడుస్తోందని ఆ సినిమా హీరోహీరోయిన్లు తేజస్ కంచర్ల, కుష్బూ చౌదరి తెలిపారు. మూవీ విజయోత్సవం సందర్భంగా విజయవాడ వచ్చిన యూనిట్ నగరంలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడిని మంగళవారం రాత్రి దర్శించుకొని పూజలు చేశారు. తమ చిత్రం వినాయకచవితి రోజున విడుదల అయ్యిందని, ఆ గణపయ్య ఆశీస్సులతో మంచి సక్సెస్ సాధించిందన్నారు.
Similar News
News October 7, 2024
మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన MLA సుజనా
రాజు సమర్థుడైతే ఆ రాజ్యం ముందు ప్రపంచమే మోకరిల్లుతుందని ప్రధాని మోదీని ఉద్దేశించి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా ఆదివారం ట్వీట్ చేశారు. ఒకప్పుడు సలహా కోసం ప్రపంచం వైపు చూసే స్థాయి నుంచి నేడు మోదీ నాయకత్వంలో అగ్రరాజ్యాలకు సలహాలు ఇచ్చే స్థాయికి భారత్ చేరుకుందని సుజనా పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకుకు సలహా ఇచ్చే ఉన్నత స్థితిలో దేశం నిలబడటానికి మోదీ నాయకత్వమే కారణమని సుజనా ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.
News October 6, 2024
కృష్ణా: డిగ్రీ పరీక్షల టైంటేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (డిస్టెన్స్) పరిధిలో డిగ్రీ(బీ.ఏ.) చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 25 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. 3వ సెమిస్టర్ పరీక్షలు 17 నుంచి 26 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
News October 6, 2024
గన్నవరంలో బంధించి పెళ్లి చేసిన పెద్దలు
గన్నవరం మండలం సూరంపల్లిలో ఓ యువకుడిని గ్రామస్థులు బంధించి పెళ్లి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సూరంపల్లికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన గుడ్డేటి ప్రసన్నతో ప్రేమాయణం నడిపారు. కులాలు వేరు వేరు కావడంతో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో శ్రీకాంత్ గ్రామానికి రావడంతో మహిళలు బంధించి ప్రసన్నతో పెళ్లి చేశామని గ్రామస్థులు తెలిపారు.