News April 6, 2026
విజయవాడలో గంజాయి స్వాధీనం

గంజాయి అక్రమ రవాణాపై విజయవాడలో పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు. ఆదివారం కండ్రిక జంక్షన్ వద్ద రత్నాకుమార్ అనే వ్యక్తి గంజాయి కలిగి ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో అతన్ని తనిఖీ చేయగా రత్నకుమార్ వద్ద 1.5కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితుడు గంజాయిని విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు నున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 14, 2026
దేవరకొండ: పరారీలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగి మంతనాలు!

దేవరకొండలోని ఓ జాతీయ బ్యాంకులో ఖాతాదారుల సొమ్ము కాజేసి పరారైన కాంట్రాక్టు ఉద్యోగి, రాష్ట్ర ఉద్యోగ సంఘ నేతతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఉద్యోగుల ఐడీలతో నిధులు దారిమళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకు అధికారులు మాత్రం సొమ్ము భద్రంగానే ఉందని తెలిపారు. రహస్యంగా దర్యాప్తు చేస్తూ, సదరు ఉద్యోగిని పట్టుకుని మిగిలిన సిబ్బందిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
News April 14, 2026
33 శాతం రిజర్వేషన్ ఆలస్యమైతే మహిళలకు అన్యాయం: మోదీ

చట్ట సభల్లోనూ మహిళలు బలంగా గళమెత్తేందుకు సమయం వచ్చేసిందని ప్రధాని మోదీ చెప్పారు. వారికి 33 శాతం సీట్లను కేటాయిస్తామని తెలిపారు. ఈ మేరకు దేశంలోని నారీమణులకు లేఖ రాశారు. ఏప్రిల్ 16 నుంచి 3 రోజులపాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ‘నారీ శక్తి వందనం అధినియమ్’ సవరణ బిల్లును ప్రవేశపెడతామన్నారు. దీనిపై ఆలస్యం జరిగితే మహిళలకు అన్యాయం చేసినట్లేనని పేర్కొన్నారు.
News April 14, 2026
పసికూనపైనే కసికూన అరంగేట్రం!

అనుకున్నట్టే వైభవ్ సూర్యవంశీకి జాతీయ జట్టులోకి ద్వారాలు తెరుచుకుంటున్నాయి. జూన్లో జరిగే <<19624839>>ఐర్లాండ్<<>> టీ20 సిరీస్కు BCCI తాజాగా అతడి పేరును షార్ట్లిస్ట్లో చేర్చినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటనే తరువాయి కానుంది. ఇదే జరిగితే జాతీయ జట్టులో చేరిన అత్యంత పిన్న వయస్కుడిగా సచిన్ రికార్డును వైభవ్ బద్దలుకొట్టనున్నారు. ఇక పసికూన ఐర్లాండ్పై ఈ కసికూన ఎలా చెలరేగుతాడో చూడాలి.


