News October 9, 2025
విజయవాడలో నకలీ మద్యం విక్రయం..?

ములకలచెరువులో తయారైన నకిలీ మద్యాన్ని విజయవాడలోని పలు బార్లలో విక్రయించినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. నిందితుడు జనార్ధనరావు భాగస్వామ్యంతో వైన్స్ మేనేజర్ కల్యాణ్ ఈ దందా నడిపినట్లు తేలింది. బెంగళూరు నుంచి ముడిసరుకు తెప్పించి, 4 నెలలుగా ఈ దందా సాగుతోంది.
Similar News
News October 9, 2025
BTG: వాగులో కొట్టుకుపోతున్న మహిళను రక్షించిన పోలీసులు

బుట్టాయగూడెం మండలం జైనవారిగూడెంకు చెందిన ఓ మహిళ జల్లెరు కాలువ దాటుతుండగా నీటి ప్రవాహానికి ప్రమాదవశాత్తు కొట్టుకుపోతుండగా పోలీసులు రక్షించారు. వెల్తురువారిగూడెం వెళ్తుండగా ఈ ప్రమాద ఘటన జరిగింది. ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు తన సిబ్బందితో కలిసి గాలించి, ఆమెను సురక్షితంగా రక్షించారు. వర్షాల కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ హెచ్చరించారు.
News October 9, 2025
FLASH: జడ్చర్ల: ‘GOVT స్కూల్లో భోజనంలో జెర్రీ’

జడ్చర్ల మండలం బాదేపల్లిలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో అక్షయ పాత్ర భోజనంలో ఈరోజు తాడి జెర్రీ వచ్చిందని, విద్యార్థులు అన్నం తినకుండా పడేశారని DYFI MBNR జిల్లా కన్వీనర్ ప్రశాంత్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం విద్యార్థులు తినేటప్పుడు అన్నంలో పురుగులు రావడంతో ఇబ్బంది పడుతూ తమకు విషయం చెప్పారని తెలిపారు. ప్రతిరోజు ఇలానే పురుగులు వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారంటూ అధికారుల తీరుపై మండిపడ్డారు.
News October 9, 2025
రాజమండ్రిలో పవన్ కళ్యాణ్కు కలెక్టర్ స్వాగతం

కాకినాడ జిల్లా పర్యటన నిమిత్తం గురువారం రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆయనకు మొక్క అందించి ఆహ్వానించారు. కొద్దిసేపటి తరువాత జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ అక్కడి నుండి కాకినాడకు పయనమయ్యారు.