News March 16, 2025
విజయవాడలో నేటి నెన్వెజ్ ధరలివే.!

విజయవాడలో చికెన్ ధరలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం స్కిన్లెస్ కిలో ధర రూ.180గా ఉండగా స్కిన్ రూ.170గా కొనసాగుతుంది. అలాగే కోడిగుడ్లు మాత్రం గత వారంతో పోలిస్తే పెరిగింది. గుడ్లు గత వారం రూ.138 ఉండగా నేడు రూ.144లకు పెరిగింది. ఇలాగే విజయవాడలో కేజీ రూ.180 ఉన్న చేపల ధర రూ.220లకు పెరిగింది. కేజీ మటన్ రూ.900లుగా కొనసాగుతోంది.
Similar News
News March 1, 2026
ట్రంప్.. శాంతి శాంతి అంటూనే..

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక శాంతి కోరుకుంటున్నా అంటూనే దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. 2025 జనవరిలో బాధ్యతలు చేపట్టాక 8 దేశాలపై దాడులు చేశారు. అందులో ఇరాన్, వెనిజులా, లాటిన్ అమెరికా, నైజీరియా, సోమాలియా, యెమెన్, సిరియా, ఇరాక్ ఉన్నాయి. ఇరాన్లో గతేడాది 12 రోజుల యుద్ధంలో 600 మంది మరణించగా ఇప్పుడు 201 మంది చనిపోయారు. వెనిజులాలో 83 మంది, లాటిన్ అమెరికాలో 151 మంది, యెమెన్లో 80 మంది మరణించారు.
News March 1, 2026
CAREFUL.. యుద్ధం.. ‘లాభాలు పక్కా’ అంటూ కాల్స్..!

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం జరుగుతోన్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో రేపు పక్కాగా లాభాలు సాధించవచ్చని అనేకమంది నాచారం పరిధి రాఘవేంద్ర నగర్, మల్లాపూర్ వేంకటేశ్వర స్వామి నగర్ కాలనీలోని ట్రేడర్లకు ఫేక్ కాల్స్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా, అలాంటి వాటిని నమ్మితే మోసపోయే అవకాశం ఉందని, ప్రజలు ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News March 1, 2026
BREAKING: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆదివారం కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. HYD బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.4,370 పెరిగి రూ.1,73,080కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.4,000 ఎగబాకి రూ.1,58,650 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.5వేలు పెరిగి రూ.3,25,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.


