News April 2, 2025
విజయవాడలో మహిళ అనుమానాస్పద మృతి

విజయవాడ ఆటో నగర్లో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. లక్ష్మి, మహంకాళి దంపతులు చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నారు. లక్మికి మహంకాలి నాలుగో భర్త. చిత్తు కాగితాలు ఏరగా వచ్చిన డబ్బుతో మద్యం తాగుతుంటారు. మంగళవారం లక్ష్మి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే భర్త మహంకాళి పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
Similar News
News November 13, 2025
ఐఫోన్ పెట్టుకునేందుకు ‘పాకెట్’.. ధర తెలిస్తే షాక్!

ఐఫోన్ పెట్టుకునేందుకు ‘యాపిల్’ కంపెనీ తీసుకొచ్చిన ‘ఐఫోన్ పాకెట్’పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆ పాకెట్ ధర $229.95. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.20,390. ధర ఎక్కువగా ఉండటంతో పాటు దాని డిజైన్ సాక్స్ను పోలి ఉండటంతో ట్రోల్స్ మరింతగా పెరిగాయి. జపనీస్ ఫ్యాషన్ లేబుల్ ‘ఇస్సే మియాకే’ తో కలిసి ఈ పాకెట్ను రూపొందించినట్లు, పరిమిత సంఖ్యలోనే వీటిని విక్రయించనున్నట్లు యాపిల్ ప్రకటించింది.
News November 13, 2025
సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ

సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ నరసింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న పలు రికార్డులను, పరిసరాలు, ఫిర్యాదుల నిర్వహణ, రిసెప్షన్ మేనేజ్మెంట్ మొదలగు అంశాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితులతో మాట్లాడి ఫిర్యాదులను త్వరితగతిన పరిశీలించాలని ఎస్సైని ఆదేశించారు. జాతీయ రహదారి వెంట పటిష్టమైన నిఘా ఉంచి భద్రత పర్యవేక్షించాలన్నారు.
News November 13, 2025
రైతులతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు యోచన: CM

రాష్ట్రంలో రైతులతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు యోచనలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. వ్యవసాయానికి యోగ్యం కాని భూములు, బీడు భూముల్లో రైతులు సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఎంతమేర లాభదాయకంగా ఉంటుందని CMచంద్రబాబు రెన్యూ పవర్ చైర్మన్ సుమంత్ సిన్హాతో చర్చించారు. సోలార్ ప్యానెల్స్ ధరలు అధికంగా ఉన్నందున వాటి తయారీ యూనిట్లు రాష్ట్రంలో పెద్దఎత్తున నెలకొల్పేందుకు ప్రోత్సహిస్తామని CM వెల్లడించారు.


