News March 5, 2025
విజయవాడలో రేపు బీసీవై యువదళం ఆవిర్భావ సదస్సు

బీసీవై యువదళం ఆవిర్భావ సదస్సు గురువారం విజయవాడలోని సుజన ది వెన్యులో జరగనుంది. పార్టీ అధినేత రామచంద్రయాదవ్ సహా జిల్లాల నుంచి యువప్రతినిధులు పాల్గొననున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీలో 50% సీట్లు యువతకే ఇస్తామని.. ఇప్పుడు నియమిస్తున్న బీసీవై యువదళం సభ్యుల్లోనే ఎక్కువమంది ప్రజా ప్రతినిధులుగా చట్ట సభల్లో అడుగు పెట్టేలా ప్రోత్సహించాలనేది తమ పార్టీ ఆలోచన అని రామచంద్ర యాదవ్ అన్నారు.
Similar News
News November 7, 2025
ఇళయరాజా కచేరీకి పటిష్ఠ బందోబస్తు: సీపీ

రేపు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న ఇళయరాజా మ్యూజికల్ కన్సర్ట్ కోసం సీపీ రాజశేఖర్ బాబు శుక్రవారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఏసీపీ దామోదర్ను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో డీసీపీలు కృష్ణకాంత్ పాటిల్, షరీనా బేగం పాల్గొన్నారు.
News November 7, 2025
ములుగు జిల్లాకు ఎంపీఓల కేటాయింపు

ములుగు జిల్లాకు ముగ్గురు నూతన మండల పంచాయతీ అధికారుల(ఎంపీఓ)ను ఉన్నతాధికారులు కేటాయించారు. ఏటూరునాగారం ఎంపీఓగా పి.వినయ్, తాడ్వాయికి జి.మహేందర్, నూగురు వెంకటాపురానికి జి.జమ్మిలాల్ను ప్రభుత్వం నియమించింది. శుక్రవారం నూతన ఎంపీఓలు కలెక్టర్ దివాకర్ టీఎస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రూప్-2 అధికారులు జిల్లాకు ఎంపీఓగా రావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 7, 2025
హెయిర్ డై వేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఒక్క తెల్లవెంట్రుక కనబడగానే కంగారు పడిపోయి జుట్టుకు రంగులువేస్తుంటారు చాలామంది. అయితే హెయిర్ డై వేసేటపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇన్స్టాంట్ కలర్ ఇచ్చే బ్లాక్ హెన్నా, షాంపూల్లో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. సల్ఫేట్లు, అమోనియా పెరాక్సైడ్, PPD లేనివి ఎంచుకోవాలి. తలస్నానం చేసి కండిషనర్ రాశాకే రంగు వేయాలి. ముఖానికి, మాడుకు మాయిశ్చరైజర్ రాసి, తర్వాత డై వేసుకోవాలని సూచిస్తున్నారు.


