News August 15, 2025
విజయవాడలో సీఎం పర్యటన.. పకడ్బందీ ఏర్పాట్లు

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా CM చంద్రబాబు ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రారంభించేందుకు నేడు విజయవాడకు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. CP రాజశేఖర్ బాబు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించి, భద్రతకు సంబంధించిన పలు ఆదేశాలు జారీ చేశారు. CM పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
Similar News
News August 15, 2025
సబ్బవరం: మహిళ మెడకు టవల్ బిగించి హత్య?

సబ్బవరం మండలం బాటజంగాలపాలెం పరిధిలో పాక్షికంగా కాలిపోయి ఉన్న గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళను వేరే ప్రాంతంలో హత్య చేసి ఇక్కడికి తీసుకువచ్చి తగలబెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు గర్భవతి అని పోలీసులు తెలిపారు. 13వ తేదీ రాత్రి మెడకు టవల్ బిగించి హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఎస్సీ తుహీన్ సిన్హా సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.
News August 15, 2025
ఏటికొప్పాక లక్క బొమ్మల కళాకారుడి ప్రతిభ

ఏటికొప్పాక లక్క బొమ్మల కళాకారుడు గుత్తి వాసు అంకుడు కర్ర, లక్కను ఉపయోగించి జాతీయ జెండాను తయారుచేసి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను రూపొందించి భక్తి భావాన్ని చాటుకున్నాడు. ఇప్పటివరకు ఏటికొప్పాక కళాకారులు జాతీయ జెండాను తయారు చేయలేదని వాసు తెలిపారు. దీనిని రూపొందించేందుకు ఆరు రోజులు సమయం పట్టిందన్నారు. దీని పొడుగు 38 సె.మీ.కాగా, వెడల్పు 28 సె.మీ. ఉంది.
News August 15, 2025
ఎస్.కోట: తలపై రాయిపడి బాలుడు మృతి

కాలకృత్యాలకు వెళ్లిన బాలుడు తలపై రాయిపడి మృతి చెందిన సంఘటన ఎస్.కోటలోని ఆకుల డిపో సమీపంలో చోటు చేసుకుంది. గురువారం ఉత్తరప్రదేశ్కు చెందిన అమీన్ ఖాన్ (17) ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. నిర్మాణంలో ఉన్న ఓభవనం పక్కన కాలకృత్యాలు కోసం వెళ్లాడు. అదే సమయంలో భవనం పైనుంచి నిర్మాణ కార్మికుడు రాయి కిందికి పడేయడంతో అది అమీన్ తలపై పడి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.