News March 28, 2025

విజయవాడ: అత్యాచారం కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష

image

మైనర్ బాలికపై అత్యాచారం కేసులు న్యాయస్థానం శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ కార్యాలయం తెలిపిన సమాచారం మేరకు.. వైఎస్సార్ కాలనీకి చెందిన ఓ బాలికతో అదే ప్రాంతానికి చెందిన ప్రసాద్(19) అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని వెంటపడి గర్భవతిని చేసి మోసం చేశాడు. విచారించిన న్యాయస్థానం నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, 30వేల జరిమాన విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది.

Similar News

News February 27, 2026

సీక్రెట్‌గా భారత్‌కు ట్రంప్ దూత!

image

గ్లోబల్ టారిఫ్స్‌ చెల్లవని కొట్టేయడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. మొన్నటివరకు భారతే వచ్చి ‘సారీ’ చెబుతుందన్న US కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లూట్నిక్ ఇప్పుడు స్వయంగా ఢిల్లీకి వచ్చి పీయూష్ గోయల్‌తో రహస్యంగా భేటీ అయ్యారు. కోర్టు తీర్పుతో ట్రంప్ బార్గెయినింగ్ పవర్ తగ్గడంతో భారత్ తన వాషింగ్టన్ పర్యటనను వాయిదా వేసి పట్టు సాధించింది. దీంతో కంగారుపడ్డ ట్రంప్ ‘గేమ్స్ ఆడకండి’ అని వార్నింగ్ ఇచ్చారు.

News February 27, 2026

ఇజ్రాయెల్‌కు అమెరికా స్టెల్త్ విమానాలు

image

ఇరాన్‌తో అణు చర్చల వేళ అమెరికా తన మోస్ట్ అడ్వాన్స్‌డ్ F-22 రాప్టర్ స్టెల్త్ యుద్ధ విమానాలను ఇజ్రాయెల్‌కు పంపింది. బ్రిటన్ నుంచి బయలుదేరిన 12 విమానాలు ఇప్పటికే అక్కడ ల్యాండయ్యాయి. ఒకవైపు ఒమన్ మధ్యవర్తిత్వంతో జెనీవాలో చర్చలు సాగుతున్నా అమెరికా మాత్రం తన మిలిటరీ బలాన్ని పెంచుతూనే ఉంది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్సామ్‌ను నిలువరించడమే లక్ష్యంగా ఫైటర్ జెట్లు, యుద్ధ నౌకలను మోహరించింది.

News February 27, 2026

​నేడు భద్రకాళి బండ్ వద్ద రాకెట్ ట్రయల్ రన్

image

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న నిర్వహించనున్న ‘రుద్రమ-1’ రాకెట్ ప్రయోగానికి సంబంధించి శుక్రవారం ఉదయం 11 గంటలకు భద్రకాళి బండ్ వద్ద ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం 5:30 గంటలకు అసలైన ప్రయోగం ఉంటుందని, విద్యార్థులు, ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు.