News March 28, 2025
విజయవాడ: అత్యాచారం కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష

మైనర్ బాలికపై అత్యాచారం కేసులు న్యాయస్థానం శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ కార్యాలయం తెలిపిన సమాచారం మేరకు.. వైఎస్సార్ కాలనీకి చెందిన ఓ బాలికతో అదే ప్రాంతానికి చెందిన ప్రసాద్(19) అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని వెంటపడి గర్భవతిని చేసి మోసం చేశాడు. విచారించిన న్యాయస్థానం నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, 30వేల జరిమాన విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది.
Similar News
News February 27, 2026
వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా..!

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి శుక్రవారం చిరుధాన్యాలు తరలిరాగా, ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు(బిల్టీ) రూ.1,905 ధర వచ్చింది. అలాగే, సూక పల్లికాయకు రూ.10వేలు, పచ్చి పల్లికాయకు రూ.5,400 ధర వచ్చింది. పసుపు క్వింటాకి కొత్తది రూ.11,151 ధర వస్తే.. నం.5 రకం మిర్చి రూ.20,200, దీపిక మిర్చి రూ.20వేలు ధర పలికాయని వ్యాపారస్థులు తెలిపారు.
News February 27, 2026
NLG: ఇంటికే రానున్న భద్రాద్రి తలంబ్రాలు!

భద్రాచలంలో ఏప్రిల్ 27న జరగనున్న సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తులకు నేరుగా అందించేందుకు టీజీ ఆర్టీసీ లాజిస్టిక్ విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నల్గొండ రీజియన్ ఆర్ఎం కె. జానీ రెడ్డి శుక్రవారం తన ఛాంబర్లో ఇందుకు సంబంధించిన గోడపత్రికను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. భక్తులు రూ. 151 చెల్లించి తలంబ్రాల ప్యాకెట్ను బుక్ చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 31వ తేదీ వరకు ఈ బుకింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.
News February 27, 2026
పుణ్యక్షేత్రాల దర్శనానికి ‘భారత్ గౌరవ్’ రైళ్లు

పుణ్యక్షేత్రాల దర్శనానికి ఐఆర్సీటీసీ ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. మార్చి 21 నుంచి జూన్ 12 వరకు తెలుగు రాష్ట్రాల నుంచి 6 ప్రత్యేక ప్యాకేజీలు నిర్వహించనున్నట్లు ఐఆర్సీటీసీ మేనేజర్ పి.వి. వెంకటేష్ తెలిపారు. రామేశ్వరం, కన్యాకుమారి యాత్రకు ₹14,700, ఉజ్జయిని, సోమనాథ్ యాత్రకు ₹17,600 టికెట్ ధరలు నిర్ణయించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


