News September 28, 2025
విజయవాడ: అమ్మవారి గుడి వైపు బైక్లకు నో ఎంట్రీ

సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా 29వ తేదీ రాత్రి 7.30 నుంచి 30న ఉదయం 10 వరకు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు సీపీ రాజశేఖరబాబు తెలిపారు. కుమ్మరిపాలెం, తాడేపల్లి చెక్పోస్ట్, గద్ద బొమ్మ సెంటర్ నుంచి బైక్లు, వాహనాలు అమ్మవారి గుడివైపు అనుమతించమన్నారు. నగరంలోకి ప్రవేశించే వాహనాలు పోలీసుల సూచనల మేరకు వారధి, వెస్ట్ బైపాస్, కనకదుర్గ ఫ్లైఓవర్, చిట్టినగర్ సొరంగం, BRTS రోడ్డు, CVR ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలన్నారు
Similar News
News September 28, 2025
తెనాలిలో వింత…! స్మశాన వాటికలో డమ్మీ సమాధిపై ఫిర్యాదు

తెనాలి ఐతానగర్ స్మశాన వాటికలో ఎటువంటి మృతదేహం లేకుండా కొన్నేళ్లుగా డమ్మీ సమాధి నిర్మించారని ఇదే ప్రాంతానికి చెందిన గడ్డేటి ప్రకాష్ బాబు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం సీఐ రాములు నాయక్ ను కలిసి 2015లో డమ్మీ సమాధిని నిర్మించినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని రాతపూర్వక ఫిర్యాదును అందజేశారు. సమాధిని ముందుగానే నిర్మించి స్థలాన్ని కబ్జా చేశారంటూ ఫిర్యాదు చేయడం సర్వత్రా చర్చనీయాంసమైంది.
News September 28, 2025
గుంటూరు: వరదల పరిస్థితిపై కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్

వరదల పరిస్థితిపై సమాచారానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. కొల్లిపర మండలం బొమ్మవానిపాలెం, అన్నవరంపాలెం లంక గ్రామాల కృష్ణా నది వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు, సిబ్బంది ఇచ్చే సూచనలు పాటించాలని ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 08963 2234014 ఫోన్ నంబరుకు సమాచారం అందించవచ్చని ఆమె చెప్పారు.
News September 28, 2025
GNT: అమ్మవారి గుడి వైపు బైక్లకు నో ఎంట్రీ

సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా 29వ తేదీ రాత్రి 7.30 నుంచి 30న ఉదయం 10 వరకు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు సీపీ రాజశేఖరబాబు తెలిపారు. కుమ్మరిపాలెం, తాడేపల్లి చెక్పోస్ట్, గద్ద బొమ్మ సెంటర్ నుంచి బైక్లు, వాహనాలు అమ్మవారి గుడివైపు అనుమతించమన్నారు. నగరంలోకి ప్రవేశించే వాహనాలు పోలీసుల సూచనల మేరకు వారధి, వెస్ట్ బైపాస్, కనకదుర్గ ఫ్లైఓవర్, చిట్టినగర్ సొరంగం, BRTS రోడ్డు, CVR ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలన్నారు.