News April 21, 2024
విజయవాడ: ఇందిరా గాంధీ స్టేడియంలో ఉచిత యోగా

స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఉచిత యోగ వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభిస్తున్నట్లు అమరావతి యోగా, ఏరోబిక్ సంఘ అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటలకు కలెక్టర్ ఢిల్లీ రావు ఈ శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. నగరంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
Similar News
News September 10, 2025
కృష్ణా: ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులతో SP సమావేశం

ఎస్పీ ఆర్. గంగాధరరావు ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేక సమావేశం బుధవారం నిర్వహించారు. పోలీస్ సూచనల ప్రకారం వివాదాస్పద, వ్యక్తిగత దూషణల ఫ్లెక్సీలు ముద్రించకూడదని, ఆర్డర్ ఇచ్చిన వారి పూర్తి వివరాలు నమోదు చేయాలిని సూచించారు. అసోసియేషన్ సభ్యులు చట్టపరంగా సహకరించి సమాజ శాంతికి కృషి చేయమని ప్రతిజ్ఞ చేసుకున్నారు.
News September 10, 2025
కృష్ణా జిల్లా టుడే టాప్ న్యూస్

☞ కృష్ణా: యూరియా పంపిణీని పరిశీలించిన కలెక్టర్.
☞ విజయవాడలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్.
☞ కృష్ణా: పట్టిసీమకు పదేళ్లు పూర్తి.
☞ కృష్ణా జిల్లాలో ముగ్గురు ఏఎస్ఐలకు ఎస్ఐలుగా ప్రమోషన్.
☞ కృష్ణా: 11,12 తేదీల్లో కళా ఉత్సవ్ పోటీలు.
☞ కృష్ణా జిల్లా రైళ్లకు కొత్త స్టాపులు.
☞ విజయవాడలో ఈనెల 26న భారీ ఈవెంట్ ప్లాన్.
☞ కృష్ణా: రీవాల్యూషన్ నోటిఫికేషన్ విడుదల.
News September 10, 2025
కృష్ణా: పట్టిసీమకు పదేళ్లు పూర్తి

పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి పదేళ్లు పూర్తవుతున్న వేళ మరో మైలురాయిని చేరుకుంది. 2015లో ప్రారంభమై 89 రోజుల్లోనే 8.3 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు అందించి రైతుల ఊపిరిగా మారింది. ఆ తరువాత 2015-19లో 263 టీఎంసీలు, 2019-24లో 165 టీఎంసీలు, ఈ ఏడాది ఇప్పటి వరకు 11.05 టీఎంసీలు చేరాయి. మొత్తంగా 439 టీఎంసీలు మళ్లించిన ఈ పథకం డెల్టా రైతులకు ఆపద్బాంధవంగా నిలిచింది.