News March 24, 2025

విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

image

ఈనెల 27న విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి రూ.75లక్షల నిధులు మంజూరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని మైనారిటీ నేతలు అందరూ పాల్గొననున్నారని చెప్పారు.

Similar News

News October 26, 2025

కృష్ణా: తుఫాన్‌ ప్రభావంపై డీపీఓ హెచ్చరిక

image

తుఫాన్‌ ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారిణి (డీపీఓ) జె.అరుణ సూచించారు. మట్టి మిద్దెలు, కల్వర్టులు, పూరి గుడిసెలు, రోడ్డు పక్కన గుడారాల్లో నివసించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. సచివాలయ ఉద్యోగులు, వీఆర్‌ఓలు, కార్యదర్శులు, ఇతర సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

News October 26, 2025

కృష్ణా: జిల్లాలో మండల ప్రత్యేక అధికారుల నియామకం

image

మొంథా తుపాన్ పరిస్థితులను అంచనా వేసేందుకు గాను జిల్లాలోని 25 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ శాఖల జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని సజావుగా తుపాన్ ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

News October 26, 2025

‘మొంథా’ తుఫాన్.. జిల్లాలో కంట్రోల్ విభాగాల ఏర్పాటు

image

‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ విభాగాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. తుఫాన్ సంబంధిత సమాచారం లేదా సహాయక చర్యల కోసం ప్రజలు ఈ కింది నంబర్‌లను సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయం 08672-252572, MTM RDO 08672-252486, గుడివాడ 08674-243693, ఉయ్యూరు 08676-232589, ఈ కంట్రోల్ రూములు నిరంతరం పనిచేస్తాయని కలెక్టర్ చెప్పారు.