News January 1, 2025
విజయవాడ: ఒత్తిడితో విద్యార్థిని ఆత్మహత్య

బీఫార్మసీ చదువుతున్న బాలిక మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సింగినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుందని సీఐ వెంకటేశ్వర్ల నాయక్ తెలిపారు. పోలీసుల కథనం.. సింగినగర్కి చెందిన విద్యార్థిని చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Similar News
News September 13, 2025
కృష్ణాజిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు

కృష్ణ జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విద్యాసాగర్ నాయుడును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసాగర్ నాయుడు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ఎస్పీగా పని చేస్తున్నారు.
News September 13, 2025
గన్నవరంలో రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15న గన్నవరంలోని ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో అండర్-14, అండర్-17 బాల బాలికల రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడా కారులు స్టడీ సర్టిఫికెట్, జనన ధృవీకరణ పత్రం, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుల సీల్ ఉన్న ఎంట్రీ ఫారంతో రావాలని ఎస్జీఎఫ్ కార్యదర్శులు అరుణ, రాంబాబు తెలిపారు. ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి.
News September 13, 2025
ఈ నెల 15 నుంచి గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు

జిల్లా పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ డీ.కే. బాలాజీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. పశుసంపదను రక్షించేందుకు ప్రతి రైతు ఈ టీకా కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు.