News March 2, 2026

విజయవాడ: కలెక్టరేట్ PGRSకు 174 వినతులు

image

NTR కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు మొత్తం 174 అర్జీలు అందినట్లు కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 66, పురపాలక 26, పోలీస్ శాఖకు 18 వినతులు వచ్చాయి. ప్రతి అర్జీని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. పారదర్శకమైన సేవలందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News March 2, 2026

ములుగు ప్రజావాణిలో 59 వినతులు

image

ములుగు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి 59 వినతులు అందాయి. వీటిలో భూ సమస్యలపై 14, ఇందిరమ్మ ఇళ్ల కోసం 14, పింఛన్ల కోసం 14, ఉద్యోగ కల్పనకు 4, ఇతర సమస్యలపై 13 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తును అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉంచకూడదన్నారు.

News March 2, 2026

KMR: రాహుల్ గాంధీ మూటల కోసం వచ్చారు: కేంద్ర మంత్రి

image

రాహుల్ గాంధీ శిక్షణా తరగతుల పేరుతో హైదరాబాద్‌కు వచ్చింది కేవలం మూటల కోసమేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కామారెడ్డిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూసీ సుందరీకరణ కోసం ఇండ్లను కూల్చివేసిన బాధితుల ఇండ్ల వద్దకు రాహుల్ గాంధీ వెళ్లాలని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. హిందూ దేవాలయాలపై జరిగిన దాడుల ప్రాంతాలను, ఖమ్మంలోని ప్రాంతాలను సందర్శించాలన్నారు.

News March 2, 2026

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్ష

image

జిల్లావ్యాప్తంగా సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్షలు శాంతియుతంగా ముగిశాయని DEO ఎన్. ప్రేమకుమార్ తెలిపారు. మొత్తం 972 మంది అభ్యర్థులకు గాను 884 మంది హాజరు కాగా, 88 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన ఈ పరీక్షల కోసం 6 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన పేర్కొన్నారు