News February 6, 2025
విజయవాడ: గోల్కొండ, ప్యాసింజర్ రైలు రద్దు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738817815633_50012803-normal-WIFI.webp)
ఈనెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గోల్కొండ, డోర్నకల్ ప్యాసింజర్ రైలు రద్దు చేస్తున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు ప్రకటించారు. దీంతో 17202, సికింద్రాబాద్ నుంచి గుంటూరు, 17201 గుంటూరు నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే గోల్కొండ ఎక్స్ప్రెస్, 67767 డోర్నకల్ నుంచి విజయవాడ వెళ్లే ప్యాసింజర్, 67768 విజయవాడ నుంచి డోర్నకల్ వెళ్లే ప్యాసింజర్ రద్దు కానున్నాయి.
Similar News
News February 6, 2025
మళ్లీ మొరాయించిన చాట్ జీపీటీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738827819744_1045-normal-WIFI.webp)
ఏఐ చాట్ బోట్ జీపీటీ మరోసారి మొరాయించింది. తమకు ఆ యాప్ యాక్సెస్ కావడం లేదంటూ సోషల్ మీడియాలో యూజర్లు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా చాట్ జీపీటీ ఇదే తరహాలో ఆగిపోవడం గమనార్హం. సమస్యపై సంస్థ స్పందించింది. ఏఐ మోడల్లో స్వల్ప ఇబ్బందులు తలెత్తడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని, చక్కదిద్దేందుకు ట్రై చేస్తున్నామని వివరణ ఇచ్చింది.
News February 6, 2025
జమిలి ఎన్నికలపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738828017073_653-normal-WIFI.webp)
AP: రాష్ట్రంలో దారుణమైన పాలన కొనసాగుతోందని YS జగన్ దుయ్యబట్టారు. ‘జమిలి ఎన్నికలు వస్తాయంటున్నారు. ఎంత త్వరగా వస్తే అంత త్వరగా చంద్రబాబును పంపాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. బాబును చొక్కా పట్టుకొని ప్రశ్నించే రోజులు, తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. బాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేనని పదేపదే చెప్పా. చంద్రముఖిని మళ్లీ నిద్రలేపి రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు.
News February 6, 2025
కామారెడ్డి: రేపు బీజేపీ జిల్లా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738820040697_51904015-normal-WIFI.webp)
కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన నీలం చిన్న రాజు ప్రమాణ స్వీకారం శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నామని బీజేపీ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ గుప్తా చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అరుణతార, మాజీ ఎంపీ బీబీ పాటిల్, పార్టీ సీనియర్ నాయకులు హాజరవుతారని ఆయన చెప్పారు.