News December 10, 2025

విజయవాడ: చిన్నారులకు కిడ్స్ ట్రాకింగ్ బ్యాండ్లు

image

భవానీ దీక్షల విరమణ కార్యక్రమం కోసం భక్తుల భద్రత నిమిత్తం 4వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల భద్రత కోసం ప్రత్యేకంగా కిడ్స్ ట్రాకింగ్ రిస్ట్‌ బ్యాండ్లను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 270 సీసీ కెమెరాలకు అదనంగా 50 కెమెరాలను జోడించి, మొత్తం 320 సీసీ కెమెరాల పర్యవేక్షణలో భద్రతను పటిష్ఠం చేశారు.

Similar News

News December 13, 2025

బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఫలితాల వెల్లడిలో మార్పులు

image

బ్యాంక్ ఉద్యోగాల నియామకాల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. SBI, నేషనల్ బ్యాంకులు, RRB (Regional Rural Banks)ల పరీక్షా ఫలితాల ప్రకటన క్రమాన్ని మార్చింది. ఇకపై ముందుగా SBI, ఆ తర్వాత నేషనల్ బ్యాంకులు, చివరగా RRBల ఫలితాలను విడుదల చేస్తారు. అదే విధంగా ముందుగా PO (Probationary Officer) రిజల్ట్స్ తరువాత క్లరికల్‌వి ప్రకటించనున్నారు. దీనివల్ల అభ్యర్థులు మంచి ఉద్యోగాన్ని సెలక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

News December 13, 2025

MLAల చేతుల్లో MRO ఆఫీసులు: ధర్మాన

image

AP: భూ సమస్యలు తీరక సామాన్యులు బాధపడుతున్నారని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ‘5 సెంటీమీటర్ల తేడా కూడా లేకుండా కొలతలు చేయగల టెక్నాలజీతో భూ సర్వే జరుపుతుంటే, సర్టిఫికెట్‌పై జగన్ బొమ్ముందని, భూములు ఆయన తీసుకుంటారని చంద్రబాబు మాయ మాటలు చెప్పారు. ఇన్నేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఒక్క భూ సంస్కరణ అయినా తెచ్చారా? నేడు ఎమ్మార్వో కార్యాలయాలన్నీ ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్లిపోయాయి’ అని విమర్శించారు.

News December 13, 2025

బి.కొత్తకోట: జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైంది వీరే.!

image

పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని శనివారం బి.కొత్తకోట బాలికల హైస్కూల్‌లో మండల స్థాయి వ్యాసరచన, వకృత్వ, క్విజ్ పోటీలు జరిపారు. మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. వ్యాసరచన పోటీల్లో మానస, వకృత్వ పోటీల్లో నవదీప్ రెడ్డి, క్విజ్ పోటీల్లో నవదీప్ రెడ్డి సత్తా చాటారని MEOలు రెడ్డిశేఖర్, భీమేశ్వరాచారి తెలిపారు. వీరు రాయచోటిలో జరిగే జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొటారన్నారు.