News September 10, 2025

విజయవాడ: టెక్నాలజీ ఎక్కువ.. పోలీసులు తక్కువ..!

image

విజయవాడలో దసరా ఉత్సవాల సందర్భంగా సుమారు 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో, గత ఏడాది కంటే తక్కువ సిబ్బందితోనే, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో బందోబస్తు నిర్వహించడానికి పోలీసులు సిద్ధమయ్యారు. డ్రోన్లు, ఏఐ సాంకేతికత, సీసీ కెమెరాల ద్వారా భక్తుల క్యూ లైన్లు, ట్రాఫిక్‌ను పర్యవేక్షించనున్నారు. సీపీ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఇప్పటికే పోలీసులు దీనిపై శిక్షణ పొందారు.

Similar News

News September 10, 2025

వనపర్తి: ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

image

జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్.సునీత అన్నారు. ఈ నెల 13న వనపర్తి జిల్లా కోర్టులలో జరగనున్న లోక్ అదాలత్‌లో రాజీకి అవకాశం ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని ఆమె తెలిపారు. చిన్న కేసుల కోసం కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బు, సమయం వృథా చేసుకోవద్దని సూచించారు.

News September 10, 2025

జగిత్యాల: గణపతి చందా ఇవ్వలేదని 4 కుటుంబాల బహిష్కరణ

image

జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో గణపతి చందా ఇవ్వలేదని గ్రామానికి చెందిన 4 కుటుంబాలను కులం నుంచి బహిష్కరించిన ఘటన ఆలస్యంగా బయటపడింది. అంతటితో ఆగకుండా ఆ కుటుంబాలతో ఎవరూ మాట్లాడకూడదని, మాట్లాడితే రూ.25 వేల జరిమానా అంటూ ఊర్లో దండోరా వేయించారు. దేవుడికి కొబ్బరికాయ కొట్టేందుకు వస్తే రూ.1,116 ఇచ్చాకే కొట్టాలన్నారు. అది కాస్త కుల బహిష్కరణకు దారి తీసినట్లు తెలుస్తోంది.

News September 10, 2025

మంచి నిద్ర కోసం చదవాల్సిన శ్లోకం

image

అగస్త్యో మాధవశ్చైవ
ముచకుందో మహామునిః
కపిలో మునిరాస్తీకః
పంచయతే సుఖశాయనః
ఈ ప్రసిద్ధమైన శ్లోకాన్ని పఠించి పడుకుంటే హాయిగా నిద్ర పడుతుందని పండితులు చెబుతున్నారు. మంచి నిద్ర కోసం రుషులను తలచుకోవాలని పెద్దలు చెబుతుంటారు. వారి పేర్లు(అగస్త్య, మాధవ, ముచుకుంద, కపిల, ఆస్తీక) కలిపి ఈ శ్లోకాన్ని రాశారు.