News September 14, 2025

విజయవాడ: డయేరియా వైద్య శిబిరం వద్ద భారీగా వైద్యులు

image

విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేట డయేరియా వైద్య శిబిరం మొత్తం భారీ స్థాయిలో వైద్యులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 18 మంది వైద్యులు, ముగ్గురు ప్రత్యేక వైద్యులు, ముగ్గురు రాపిడ్ టెస్టింగ్ వైద్యులు, 36 మంది నర్సులు, 60 మంది ఆశా కార్యకర్తలను శిబిరం వద్ద విధుల నిమిత్తం కేటాయించింది. వీరిలో వైద్యులు నర్సులు ఆశా కార్యకర్తలు 20 బృందాలు ఏర్పడి న్యూ ఆర్ఆర్ పేటలోని ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారు.

Similar News

News September 14, 2025

కలెక్షన్లలో దుమ్మురేపుతోన్న ‘మిరాయ్’

image

తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఫాంటసీ మూవీ ‘మిరాయ్’ కలెక్షన్లలో దుమ్మురేపుతోంది. ఈ చిత్రం రెండు రోజులకు వరల్డ్ వైడ్‌గా ₹55.60 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. పాజిటివ్ టాక్ రావడం, వీకెండ్ కూడా కావడంతో వసూళ్లు ఇంకా పెరుగుతాయని వారు భావిస్తున్నారు. మంచు మనోజ్ కీలక పాత్రలో, రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు.

News September 14, 2025

సెప్టెంబర్ 17 నుంచి స్వస్త్ నారీ-సశక్త్ పరివార్: కలెక్టర్

image

జనగామ జిల్లాలో స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమమని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, పిల్లల ఆరోగ్య సాధికారత కోసం శిబిరాలు ఏర్పాటు చేసి స్క్రీనింగ్ చేయనున్నట్లు వివరించారు. ANC తనిఖీలు చేపట్టి రోగనిరోధక శక్తిపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1న మెగా రక్తదానం కూడా జరుగుతుందన్నారు.

News September 14, 2025

ASIA CUP: ట్రెండింగ్‌లో Boycott INDvPAK

image

ఆసియాకప్‌లో భాగంగా మరికొన్ని గంటల్లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో SMలో కొందరు ఇండియన్స్ BoycottINDvPAK హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. టెర్రరిస్టులతో క్రికెట్ వద్దు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచును చూడకుండా టీవీలు ఆఫ్ చేసి పహల్గామ్ దాడి బాధితులకు అండగా నిలవాలని కోరుతున్నారు. మరికొందరు క్రికెట్‌ను ఉగ్రవాదంతో ముడిపెట్టకూడదని అంటున్నారు. దీనిపై మీ కామెంట్?