News September 13, 2025

విజయవాడ దుర్గగుడిలో రూ.500 టికెట్ల రద్దు?

image

దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రూ.500 అంతరాలయ దర్శనం టిక్కెట్లను రద్దు చేసే యోచనలో ఆలయ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. గత దసరా ఉత్సవాలలో ఈ టికెట్లు తీసుకున్న భక్తులను ప్రధాన ద్వారం నుంచే దర్శనం చేయించి పంపించారు. గతేడాది ఈ టికెట్ల ద్వారా ఆలయానికి రూ.2.30 కోట్ల ఆదాయం లభించింది. ఈసారి కేవలం రూ. 300 టికెట్లను మాత్రమే విక్రయిస్తారని సమాచారం.

Similar News

News September 13, 2025

HYD: ఫోన్‌కు APK ఫైల్.. నొక్కితే రూ.95,239 మాయం

image

హైదరాబాద్‌లో టైలర్‌కు RTO CHALLAN పేరిట APK ఫైల్ వచ్చింది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే అకౌంట్ నుంచి రూ.95,239 మాయమయ్యాయి. సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ డేటా దొంగిలించి ఆన్‌లైన్ ఆర్డర్ చేశారు. బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా డబ్బు తిరిగి వచ్చేలా చేశారు. ఇలాంటి APK ఫైల్‌తో మెసేజ్ వస్తే క్లిక్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

News September 13, 2025

HYD: ఫోన్‌కు APK ఫైల్.. నొక్కితే రూ.95,239 మాయం

image

హైదరాబాద్‌లో టైలర్‌కు RTO CHALLAN పేరిట APK ఫైల్ వచ్చింది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే అకౌంట్ నుంచి రూ.95,239 మాయమయ్యాయి. సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ డేటా దొంగిలించి ఆన్‌లైన్ ఆర్డర్ చేశారు. బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా డబ్బు తిరిగి వచ్చేలా చేశారు. ఇలాంటి APK ఫైల్‌తో మెసేజ్ వస్తే క్లిక్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

News September 13, 2025

రెచ్చగొట్టే వారి ఉచ్చులో పడొద్దు: పవన్ కళ్యాణ్

image

AP: తనపై దుష్ప్రచారం చేసేవారిని ప్రజాస్వామ్యయుతంగా, చట్టప్రకారమే తిప్పికొట్టాలని జనసైనికులకు Dy.CM పవన్ కళ్యాణ్ సూచించారు. ఘర్షణ పడడం ద్వారా సమస్య మరింత జటిలమవుతుందని పేర్కొన్నారు. ‘పదేళ్లుగా మనపై కుట్రలు చేస్తున్నవారిని చూస్తూనే ఉన్నాం. అలాంటివారి ఉచ్చులో పడొద్దు. ఎవరూ ఆవేశానికి గురై గొడవలకు దిగవద్దు. కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించేవారిని చట్టం ముందు నిలబెట్టాలి’ అంటూ దిశానిర్దేశం చేశారు.