News March 30, 2025
విజయవాడ దుర్గమ్మ ప్రసాదంలో మేకు

విజయవాడ ఇంద్ర కీలాద్రి అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అమ్మవారి ప్రసాదంలో మేకు వచ్చిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. భక్తుల వివరాల మేరకు.. కొందరు భక్తులు శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. అనంతరం వారు మహా మండపం కింద 4 వ ప్రసాదం కౌంటర్లో పులిహోర పొట్లాలు కొనుగోలు చేశారు. వారు ప్రసాదం తింటుండగా మేకు రావడంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 6, 2025
ఓ వైపు చిరుతలు, మరో వైపు ఏనుగులు.. పవన్ దారెటు.!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తరచూ <<18213730>>చిరుతలు<<>>, ఏనుగుల భయం ప్రజలను వెంటాడుతోంది. అటవీ సమీప ప్రాంతాల్లో చిరుతలు బయటకు వచ్చి పశువులపై దాడి చేస్తున్న ఘటనలు అధికం అవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో <<18203282>>ఏనుగులు<<>> తిష్టవేసి పంట పొలాలను ధ్వంసం చేస్తూ ప్రాణ నష్టమూ కలిగిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో అటవీ శాఖ మంత్రి పవన్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
News November 6, 2025
హనుమకొండ: 9న నిరుద్యోగులకు ఉద్యోగ మేళా

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ విద్యార్థుల కోసం ఈ నెల 9న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సమగ్ర శిక్ష (SSA) ప్రకటించింది. ఈ మేళా హనుమకొండలోని ప్రాక్టీసింగ్ హైస్కూల్లో జరగనున్నట్లు పేర్కొంది. వృత్తి విద్యా కోర్సులు (IT&ITES, M&E, అగ్రికల్చర్, బ్యాంకింగ్ తదితర) పూర్తి చేసిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ముఖ్య ఉద్దేశమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News November 6, 2025
‘అవిశ’ పశువులకు పోషకాలతో కూడిన మేత

అవిశ ఆకులు పశువులకు ముఖ్యంగా పాలిచ్చే వాటికి, మేకలకు అద్భుతమైన ఆహారమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అవిశ ఆకుల్లో 25-30 శాతం ప్రొటీన్లు ఉంటాయి. పశువులకు సులభంగా జీర్ణమయ్యే మేత ఇది. పశువులు అవిశ ఆకులను చాలా ఇష్టంగా తిని అధిక పాల దిగుబడినిస్తాయి. అవిశ పిండి(అవిశ గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థం)ని కూడా పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. దీనిలో ప్రొటీన్లు, పోషకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.


