News June 15, 2024

విజయవాడ నుంచి ముంబయికి విమాన సర్వీసు ప్రారంభం

image

గన్నవరం విమానాశ్రయం నుంచి ముంబయికి విమాన సర్వీసు శనివారం ప్రారంభంకానుంది. ఈ సర్వీసును గన్నవరం విమానాశ్రయంలో శనివారం ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని చిన్ని ప్రారంభించనున్నారు. శనివారం సాయంత్రం 5.15 గంటలకు ముంబయి నుంచి విజయవాడకు ఎయిరిండియా విమానం రానుంది. టికెట్‌ ప్రారంభ ధర రూ.5,600గా నిర్ణయించడంతో డిమాండ్ ఏర్పడింది. ప్రతి రోజూ రాత్రి 7.10 గంటలకు ఈ సర్వీసు విజయవాడ నుంచి బయలుదేరుతోందని తెలిపారు.

Similar News

News October 2, 2024

షెడ్యూల్లో మార్పు.. బందరు పోర్టుకు బయల్దేరిన చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు షెడ్యూల్లో మార్పులు జరిగాయి. కొద్దిసేపటి కిందటే ఆయన బందరు పోర్టుకు బయల్దేరారు. మచిలీపట్నం పర్యటన పూర్తి చేసుకున్న చంద్రబాబు.. తాడేపల్లి వెళ్లాల్సి ఉంది. కాగా, షెడ్యూల్లో మార్పులు చేసుకొని పోర్టుకు బయల్దేరారు. కాగా, మచిలీపట్నం సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. పోర్టు పనులను వేగవంతం చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

News October 2, 2024

కృష్ణా: రేపు టెట్ పరీక్ష రాయనున్న అభ్యర్థులు

image

కృష్ణా, NTR జిల్లాలలో అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. 2 జిల్లాలలోని 9 కేంద్రాలలో మొత్తంగా 58,089 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు టెట్ పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతోందని చెప్పారు. పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.

News October 2, 2024

గాంధీజీ బోధనలు మనకు మార్గదర్శకం: అబ్దుల్ నజీర్

image

మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకొని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన స్మృతికి నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన బుధవారం విజయవాడ రాజ్‌భవన్ నుంచి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గాంధీజీ చేసిన శాశ్వతమైన బోధనలు మనందరికీ మార్గదర్శకమని, ప్రజలకు స్ఫూర్తినిచ్చే జీవన విధానంగా అహింస మార్గాన్ని ఆయన బోధించారని గవర్నర్ స్పష్టం చేశారు.