News February 18, 2025

విజయవాడ: నేడు సబ్ జైలు వద్దకు రానున్న జగన్

image

విజయవాడకు నేడు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌తో సబ్ జైల్లో ములాకత్ అవనన్నారు. ఉదయం 9:30 గంటలకు సబ్ జైల్లో వంశీని జగన్ పరామర్శించనున్నారు. జగన్ గాంధీనగర్‌లోని సబ్ జైల్ వద్దకు రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్‌తో పాటు రాష్ట్రంలోని పలువురు వైసీపీ నేతలు సబ్ జైలు వద్దకు రానున్నారు.

Similar News

News March 14, 2025

HOLI: సెలబ్రేషన్స్ పేరుతో హద్దులు దాటకండి..

image

హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం కామన్. అయితే ఇదే అదనుగా కొందరు తమలోని ఆకతాయితనాన్ని బయటకు తీస్తారు. ఇది పరిధిలో ఉంటే పర్లేదు కానీ హద్దు దాటితేనే సమస్య. ఎదుటి వారి ఇష్టంతోనే వారిపై రంగులు చల్లేందుకు ప్రయత్నించండి. పండగ పేరుతో ఇతరులను ఇష్టం వచ్చినట్లు తాకి, రంగులు పూసి ఇబ్బంది పెట్టకండి. ముఖ్యంగా తెలియని వారి విషయంలో హుందాగా వ్యవహరించండి.
HAPPY HOLI

News March 14, 2025

గోపాల మిత్రుల ఆధ్వర్యంలో రూ. లక్ష ఆర్థిక సహాయం

image

సిద్దిపేట మండలానికి చెందిన గోపాలమిత్ర మార్గడి వెంకట్ రెడ్డి ఇటీవల మృతి చెందారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా గోపాలమిత్ర సంఘం సభ్యుల ఆధ్వర్యంలో గురువారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గోపాల మిత్ర అధ్యక్షుడు సింగం రాజు యాదవ్, రాష్ట్ర సలహాదారు శ్రీరాములు, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి ఉన్నారు.

News March 14, 2025

హిందీ పరీక్ష రాసేందుకు ఆ విద్యార్థులకు మరో ఛాన్స్

image

హోలీ పండగ కారణంగా రేపు హిందీ పరీక్ష రాయలేని సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తామని బోర్డు తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పండగ మార్చి 15న నిర్వహించుకుంటున్నారని ఎగ్జామ్ కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ తెలిపారు. పరీక్షను షెడ్యూల్ ప్రకారమే నిర్ణయించినా రేపు ఎగ్జామ్ రాయలేని స్పోర్ట్స్ కోటా విద్యార్థులకు మరో అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. తేదీని త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

error: Content is protected !!