News September 14, 2025
విజయవాడ: పండుగ వేళ ప్రత్యేక రైళ్లు

దసరా, దీపావళి సందర్భంగా విజయవాడ మీదుగా చెన్నై సెంట్రల్(MAS), బరౌని(BJU) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.06039 MAS-BJU ట్రైన్ను నేటి నుంచి NOV 30 వరకు ప్రతి ఆదివారం, నం.06040 BJU-MAS ట్రైన్ను SEPT 17 నుంచి DEC 3 వరకు ప్రతి బుధవారం నడుపుతామన్నారు. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడ, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, రాజమండ్రితో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Similar News
News September 14, 2025
లోక్సభ ర్యాంకిగ్స్లో హిందూపురం MPకి 20వ ర్యాంక్

లోక్సభలో MPల పెర్ఫామెన్స్ రిపోర్ట్ను పార్లమెంట్ ఆదివారం విడుదల చేసింది. 2024 జూన్ 24 నుంచి 2025 ఏప్రిల్ 4వ తేదీ వరకు MPలు పాల్గొన్న డిబెట్లు, అడిగిన క్వశ్చన్స్, అటెండెన్స్ ఆధారంగా ఈ ర్యాంక్లు ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం హిందూపురం MP పార్థసారథి 20వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్సభలో మొత్తం 72 ప్రశ్నలు అడిగారు. 1 చర్చలో పాల్గొన్నారు. కాగా ఆయన హాజరు 69.12శాతం గా ఉంది. ఈయన పనితీరుపై మీ కామెంట్..!
News September 14, 2025
అదాలత్లో 10,321 కేసులు పరిష్కారం: వరంగల్ సీపీ

జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన లభించిందని, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 10,321 కేసులు పరిష్కారమయ్యాయని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఇందులో ఎఫ్ఐఆర్ కేసులు, డ్రంకన్&డ్రైవ్, మోటార్ వాహన చట్టం, సైబర్ కేసులు వంటివి ఉన్నాయని ఆయన వివరించారు. ఈ అదాలత్ విజయవంతం కావడంలో కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు.
News September 14, 2025
హైదరాబాద్లో మొదలైన వర్షం

TG: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, మేడిపల్లి, అల్వాల్, సుచిత్ర, కొంపల్లి, కంటోన్మెంట్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. కాసేపట్లో నగరంలోని ఇతర ఏరియాలకూ విస్తరించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. మరి మీ ప్రాంతంలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.