News November 5, 2024

విజయవాడ: పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజుల గడువును పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. గతంలో ప్రకటించిన గడువు ప్రకారం అపరాధ రుసుము లేకుండా అక్టోబరు 28కి ఫీజులు చెల్లించాల్సి ఉంది. అయితే ఆ గడువును ఈ నెల 18 వరకు పెంచుతూ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఆదేశాలు జారీచేశారు. రూ.50 అపరాధ రుసుముతో ఈ నెల 25 వరకు రూ.200 అపరాధ రుసుముతో చెల్లించవచ్చు అన్నారు.

Similar News

News July 9, 2025

కృష్ణా: ఉచిత బస్సుపై ఆ ప్రాంతాల ప్రజలకు నిరాశ.!

image

పెనమలూరు, గన్నవరం మండలాలవారు నిత్యం విజయవాడ నగరానికి ఉద్యోగాలు, విద్య, ఇతర అవసరాల కోసం ప్రయాణిస్తుంటారు. అయితే సీఎం చంద్రబాబు ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం జిల్లాకే పరిమితం అన్న స్పష్టతతో ఆ ప్రయాణికుల్లో అసంతృప్తి నెలకొంది. కానీ ఈ మండలాల నుంచి విజయవాడ కూతవేటు దూరంలో ఉన్నా ఉచిత ప్రయాణం వర్తించకపోవడం విద్యార్థులు, ఉద్యోగులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. దీనిపై మీ కామెంట్.!

News July 9, 2025

కృష్ణా: పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీలు

image

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (PACS)లకు త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో మొత్తం 66 పీఏసీఎస్‌లకు కమిటీలను ఏర్పాటు చేశారు. ఛైర్మన్‌గా ఒకరు, సభ్యులుగా ఇద్దరిని నియమించారు. ఈ కమిటీల ఆధ్వర్యంలో పీఏసీఎస్‌ల సీఈఓ, కార్యదర్శులు పని చేయనున్నారు. పీఎసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించే వరకు ఈ కమిటీలు పని చేస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News July 8, 2025

నేరాలు జరగకుండా పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేయాలి: SP

image

ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకొని, రాత్రిపూట జరిగే దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరగకుండా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆర్.గంగాధర్ రావు అన్నారు. మంగళవారం మచిలీపట్నంలో సీసీఎస్ పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. దొంగతనాలకు పాల్పడే వారి ఆటలకు చెక్ పెడుతూ, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు చేసే వారిపై నిఘా ఉంచాలన్నారు.