News July 22, 2024

విజయవాడ: పసుపు దుస్తులు, కండువాలతో అసెంబ్లీకి..

image

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎమ్మెల్యేలు పసుపు దుస్తులు, కండువాలు ధరించి అసెంబ్లీకి హాజరు కానున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రజా ప్రతినిధులకు అధిష్ఠానం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.. సమావేశాలకు ముందు సీఎం చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ శాసనసభాపక్షం వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనుంది.

Similar News

News January 6, 2026

ఎరువుల వినియోగంపై అవగాహన అవసరం: కలెక్టర్

image

ఆరోగ్యకరమైన పంటల సాగుకు రైతులు ఎరువులను విచక్షణతో వినియోగించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ డీ.కే. బాలాజీ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన ధర్తీ మాత బచావో నిగ్రాన సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు అనవసరంగా రసాయన ఎరువులు వాడకుండా నియంత్రించే బాధ్యత వ్యవసాయ శాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తలపై ఉందని తెలిపారు.

News January 6, 2026

బండారు దత్తాత్రేయకు గన్నవరంలో ఘన స్వాగతం

image

హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సోమవారం హైదరాబాద్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బీజేపీ రాష్ట్ర నేతలు కానూరి శేషు మాదవి, నాదెండ్ల మోహన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం బండారు దత్తాత్రేయ రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు.

News January 6, 2026

కృష్ణా: కోడి పందేల నిషేధంపై కరపత్రల ఆవిష్కరణ

image

జిల్లాలో కోడి పందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఎక్కడైనా జరిగితే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని కలెక్టర్ డీ.కే.బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఛాంబర్‌లో ఎస్‌పీసీఏ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అనంతరం కోడిపందేల నిషేధంపై రూపొందించిన కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు.