News April 1, 2025
విజయవాడ: ‘పేదల భద్రతే ప్రభుత్వ లక్ష్యం’

ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పేదలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తామని, ఇంటివద్దే పింఛన్ల పంపిణీతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని జిల్లా ప్రత్యేక అధికారి జి. జయలక్ష్మి తెలిపారు. మంగళవారం విజయవాడ రూరల్, గొల్లపూడి రెండో సచివాలయంలో పింఛన్ల పంపిణీని పరిశీలించారు. జిల్లాలో 2,28,813 లబ్ధిదారులకు రూ. 98.11 కోట్లు పంఛన్లు పంపిణీ చేసినట్టు తెలిపారు.
Similar News
News April 2, 2025
సిద్దిపేట: ఇందిరమ్మ ఇళ్లపై స్పెషల్ సెక్రటరీ కాన్ఫరెన్స్

ఇళ్లు లేని పేదల సొంతింటి కలను సాకారం చేసేలా, రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర హౌజింగ్ స్పెషల్ సెక్రటరీ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి జిల్లా అధికారులతో స్పెషల్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశనం చేశారు. జిల్లా నుంచి అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News April 2, 2025
ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు

∆}ఖమ్మం:శ్రీశైలం మల్లన్న సేవలో తెలంగాణ మంత్రి పొంగులేటి∆} ఖమ్మం: ఏప్రిల్ నెలాఖరు నాటికి ప్లాస్టిక్ రహితం చేయాలి: కలెక్టర్∆}మధిర: నిజాయితీ చాటుకున్న కండక్టర్∆}ఖమ్మం రూరల్: భూ కబ్జాలో నలుగురికి రిమాండ్∆} నేలకొండపల్లి:ట్రైన్ క్రింద పడి కానిస్టేబుల్ మృతి∆}బోనకల్ లో ట్రైన్ ఢీకొని వ్యక్తి మృతి∆}ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి: మంత్రి తుమ్మల
News April 2, 2025
రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం: విశాఖ సీపీ

విశాఖ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా ప్రమాద బాధితులకు బుధవారం లక్ష రూపాయలు పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఇటీవల హిట్ రన్లో తీవ్ర గాయాలపాలైన మొండెం రామక్రిష్ణ, జన సన్యాసప్పాడుకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా 32 మందికి రూ.26,50,000 ఇచ్చినట్లు తెలిపారు.