News February 14, 2025

విజయవాడ: పోలీసులు కీలక ప్రకటన

image

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ గురువారం కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, పబ్లిక్ పరీక్షల దృష్ట్యా నేటి నుంచి ఏప్రిల్ 3వరకు సెక్షన్ 163 కింద ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ స్పష్టం చేశారు. నగర పరిధిలో ఎక్కవ మంది గుమికూడవద్దన్నారు. కర్రలు, రాళ్లు, మారణాయుధాలు పట్టుకుని తిరగొద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News February 14, 2025

మనోహరాబాద్: రోడ్డు ప్రమాదంలో కొరియర్ బాయ్‌కి గాయాలు

image

మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రాజు (24) కొరియర్ బాయ్‌గా పని చేస్తున్నాడు. రాత్రి హైదరాబాద్ వైపు నుంచి తూప్రాన్ వైపు ద్విచక్ర వాహనంపై వస్తూ రామాయపల్లి బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రాజు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు.

News February 14, 2025

సంగారెడ్డి: ఆన్‌లైన్‌లో పదో తరగతి విద్యార్థుల FA మార్కులు

image

సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల ఎఫ్ఏ మార్కుల రికార్డులను పర్యవేక్షణ బృందం గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పర్యవేక్షణ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

News February 14, 2025

దామరగిద్ద: జపాన్‌లో ప్రదర్శనకు ఎంపిక విద్యార్థి ఆవిష్కరణ

image

దామరగిద్ద గురుకుల పాఠశాలకు చెందిన శివారెడ్డి తయారు చేసిన కోకోనట్ ఫైబర్ పాట్స్ ప్రాజెక్టును డిల్లీలో జరిగిన జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిట్స్ జపాన్‌లో జరిగే సకురా ప్రోగ్రామ్‌కు ఎంపికైనట్లు గైడ్ టీచర్ జరీనా బేగం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు విద్యార్థిని, గైడ్ టీచర్‌ను అభినందించారు. రాష్ట్రం నుంచి 4 ప్రాజెక్టులు ఎంపికైనట్లు చెప్పారు.

error: Content is protected !!