News June 26, 2024
విజయవాడ: ప్రేమించిన వ్యక్తి మాట్లాడటం లేదని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది..

ప్రేమించిన వ్యక్తి 2 నెలలుగా మాట్లాడటం లేదని ఓ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ మేరకు యువతి సోదరుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిజియోథెరపి చదవిన యువతికి 6 నెలల కిందట ఓ ప్రొఫెసర్తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. తనను నమ్మించి మోసం చేశాడని, 2 నెలలుగా మాట్లాడట్లేదనే మనస్తాపంతో యువతి ఈ నెల 23న ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Similar News
News September 15, 2025
మచిలీపట్నంలో మీకోసం కార్యక్రమం: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.
News September 14, 2025
కృష్ణాజిల్లా టుడే టాప్ న్యూస్

☞ మచిలీపట్నం ఎంపీకి మూడవ ర్యాంక్
☞ జగన్ ఓ డ్రామాల కింగ్: ఎంపీ
☞ గన్నవరం విమానాశ్రయంలో కనకదుర్గమ్మ దివ్య దర్శనం
☞ మోపిదేవి: సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో భక్తుల రద్దీ
☞ కృష్ణాజిల్లా ఎస్పీ నేపథ్యం ఇదే.!
☞ గన్నవరం ఎయిర్పోర్ట్ బోర్డు విషయంలో ఎమ్మెల్యే అసంతృప్తి
☞ గన్నవరం: హాస్టల్ వంట మనిషిపై విద్యార్థుల దాడి
News September 14, 2025
మచీలీపట్నం ఎంపీకి మూడవ ర్యాంక్

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో మచీలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి మూడవ స్థానంలో నిలిచారు. ఆయన లోక్సభలో మొత్తం 72 ప్రశ్నలు అడగటంతో పాటు 18 చర్చల్లో పాల్గొన్నారు. ఆయన హాజరు శాతం 79.41%గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.