News October 6, 2025
విజయవాడ బస్టాండ్లో గుండెపోటుతో వ్యక్తి మృతి

విజయవాడ బస్టాండ్లో ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. భార్యతో కలిసి గుంటూరు నుంచి మచిలీపట్నానికి వెళ్తున్న క్రమంలో 47వ ఫ్లాట్ఫామ్ వద్ద గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. లక్షలాది మంది ప్రయాణికులు వచ్చే బస్టాండ్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ కారణంగా అస్వస్థతకు గురవుతున్న వారిని పట్టించుకునే నాథుడే లేడని మండిపడ్డారు.
Similar News
News October 6, 2025
అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్ష

ఆకాంక్షిత జిల్లా అభివృద్ధి కార్యక్రమాల అమలు స్థితిని సమీక్షించడానికి, కేంద్రప్రభారి అధికారి సోలామన్ అరోకియా రాజ్, అదనపు కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల శాఖ, సోమవారం జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జిల్లా ప్రధాన కేంద్రాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, వ్యవసాయ, మహిళా, ఇతర అభివృద్ధి సంబంధిత కేంద్రాలను పరిశీలించి, కలెక్టరేట్లో జిల్లా అధికారులతో కలసి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
News October 6, 2025
సంగారెడ్డి: పది ప్రత్యేక తరగతుల్లో మార్పులు

పదో తరగతి ప్రత్యేక తరగతులు సాయంత్రం 4:15 నుంచి 5:15 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు సాయంత్రం మాత్రమే ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.
News October 6, 2025
CJIపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: ప్రధాని

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ BR <<17928232>>గవాయ్పై దాడిని<<>> తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘దీనిపై గవాయ్ గారితో మాట్లాడాను. మన సమాజంలో అలాంటి చర్యలకు తావు లేదు. ఆ ఘటన ప్రతి భారతీయుడికి కోపం తెప్పించింది. అలాంటి క్లిష్ట సమయంలో గవాయ్ శాంతంగా ఉండటాన్ని అభినందిస్తున్నా’ అని పేర్కొన్నారు.