News October 9, 2025
విజయవాడ బస్టాండ్ థియేటర్లో బొమ్మ పడుతుందా!

విజయవాడ PNBS బస్టాండ్లో 2 మినీ థియేటర్లు, దుకాణాల టెండర్లకు స్పందన అంతంతమాత్రంగానే ఉంది. 35 షాపుల్లో 19కి మాత్రమే 50 మంది వేలంలో పాల్గొన్నారు. 6 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలనడం, ఇతర నిబంధనలతో వ్యాపారులు మందుకు రావట్లేదని తెలుస్తోంది. 2 థియేటర్ల లీజుకు ఇద్దరే ముందుకు రాగా.. రూ.3-4 లక్షల లీజు వస్తే ఇచ్చేందుకు అధికారులు చూస్తున్నారు. కాగా గతంలో ప్రయాణికుల్ని అలరించిన ఈ థియేటర్లు నిరుపయోగంగా మారాయి.
Similar News
News October 9, 2025
98 ఇంజినీర్ పోస్టులు.. దరఖాస్తు చేశారా?

IOCL అనుబంధ సంస్థ నుమాలీగఢ్ రిఫైనరీ లిమిటెడ్లో 98 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ(OCT 10). ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు ఇంజినీరింగ్లో కనీసం 65% మార్కులతో పాసై ఉండాలి. అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు PG, నెట్/గేట్ అర్హత సాధించాలి.
* ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 9, 2025
KNR: నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి..!

నేడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే తొలి విడత ఎన్నికలు జరిగే ZPTC, MPTC స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నామినేషన్లు స్వీకరించడానికి అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తిచేశారు. మొదటి విడతలో KNR జిల్లాలో 6 ZPTC, 70 MPTC, సిరిసిల్ల 7 ZPTC, 65 MPTC, పెద్దపల్లి 7 ZPTC, 68 MPTC, జగిత్యాల 10 ZPTC, 108 MPTC స్థానాలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. SHARE.
News October 9, 2025
త్రిపురాంతకం వద్ద యాక్సిడెంట్.. ఒకరి మృతి

త్రిపురాంతకంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మేడపి సమీపంలోని మానేపల్లి రహదారిలో ద్విచక్ర వాహనం – బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.