News July 6, 2025
విజయవాడ: భక్తులతో కిటకిటలాడిన కనకదుర్గమ్మ ఆలయం

ఆషాడ మాసపు చివరి ఆదివారం, తొలి ఏకాదశి కావడంతో కనకదుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వందలాది సారె బృందాలు అమ్మవారిని దర్శించుకున్నాయి. మహా మండపం ఆరవ అంతస్తులో శాకాంబరీ ఉత్సవాలకు భక్తులు సమర్పించిన కాయగూరలు, పండ్లను ఈవో శీనా నాయక్ పరిశీలించారు. సారె బృందాల కోసం లిఫ్ట్, దర్శన మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Similar News
News July 7, 2025
రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

రేపు APలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మరోవైపు TGలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, జనగాం, RR, HYD, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.
News July 7, 2025
సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇద్దరు యువకులు బైక్పై వేగంగా వెళ్తూ గ్రామానికి చెందిన కొత్తూరు సత్తయ్య ఇంటి గోడను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు బోదాసు శ్రీకాంత్, దామెర రిషిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News July 7, 2025
అనకాపల్లి జిల్లాలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

అనకాపల్లి(M) తగరంపూడి వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రావికమతం(M) మట్టవానిపాలెంకి చెందిన బలిరెడ్డి ప్రసాద్(46) మరణించగా అతని భార్య ఉష తీవ్ర గాయాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తుంపాలలో తన సొంత వ్యవసాయ భూమిలో వరి విత్తనాలు పోసేందుకు బైక్పై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. వీరికి కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.