News March 18, 2024
విజయవాడ: మరోసారి గెలిస్తే చరిత్రే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710759869548-normal-WIFI.webp)
విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి వరుసగా 3వ సారి పోటీ చేస్తున్న కేశినేని నాని అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. విజయవాడలో ఇప్పటి వరకూ 17 సార్లు ఎన్నికలు జరగగా కానూరి లక్ష్మణరావు మాత్రమే 1962, 67, 71లో వరుసగా 3 సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014, 19లో టీడీపీ నుంచి గెలిచిన నాని రానున్న ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిస్తే లక్ష్మణరావు రికార్డును సమం చేసే అవకాశం ఉంది.
Similar News
News July 3, 2024
DSC అభ్యర్థులకు.. విజయవాడలో ఫ్రీ కోచింగ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719981550116-normal-WIFI.webp)
DSC పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దీనికై అభ్యర్థులు ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సర్కిల్ సంచాలకులు కిరణ్మయి తెలిపారు. అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో పండరీపురం రోడ్ నం.8 అశోక్నగర్, విజయవాడలోని స్టడీ సర్కిల్లో నిర్ణీత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 30తో దరఖాస్తు గడువు ముగియగా తాజాగా జులై 10 వరకు పెంచామని ఆమె చెప్పారు.
News July 3, 2024
విజయవాడ: ఆదాయపు పన్ను చెల్లించడం మన కర్తవ్యం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719972934740-normal-WIFI.webp)
ఆదాయపు పన్ను చెల్లించడం మన కర్తవ్యమని ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లిస్తూ దేశాభివృద్ధికి తోడ్పడాలని డీఆర్ఎం నరేంద్ర, ఆనందరావు, పాటిల్ కోరారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్, ఆదాయపు పన్ను శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రైల్వే ఆడిటోరియంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. దేశ ఆర్థికాభివృద్ధిలో ఆదాయ సేకరణ కీలకమని చెప్పారు.
News July 3, 2024
మైలవరం: పింఛన్ల పంపిణీలో VRO చేతివాటం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719972109403-normal-WIFI.webp)
పింఛన్ల పంపిణీలో VRO చేతివాటం చూపిన ఘటన మైలవరంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మైలవరంలోని 5వ సచివాలయ పరిధిలో VROగా పనిచేస్తున్న తరుణ్ సోమవారం 43 మందికి పింఛన్లు పంచాడు. అనంతరం మరో 7మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఐరిస్ తీసుకుని సంతకం చేయించుకుని సర్వర్ పనిచేయలేదని తెలిపాడు. చివరికీ రూ.48వేల డబ్బును సొంతానికి వాడుకున్నాడు. విషయం తెలుసుకున్న MPDO, తహశీల్దార్ చర్యలు తీసుకుంటామన్నారు.