News March 19, 2025

విజయవాడ మీదుగా నడిచే 2 రైళ్లు రద్దు

image

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా నడిచే 2 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.22875 విశాఖపట్నం – గుంటూరు, నం.22876 గుంటూరు- విశాఖపట్నం ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఈ నెల 24న రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని కోరుతూ రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Similar News

News December 24, 2025

‘నీమాస్త్రం’ తయారీ, వినియోగం(2/2)

image

ముందు చెప్పిన పదార్థాలను ఒక సిమెంట్ తొట్టె/డ్రమ్ములో వేసి బాగా తిప్పాలి. 24 గంటలపాటు నీడలో పులియబెట్టాలి. గోనె సంచి కప్పిఉంచాలి. రోజుకు 2 సార్లు ఉదయం, సాయంత్రం 2 నిమిషాల పాటు కుడివైపునకు కలియతిప్పాలి. 24 గంటల తర్వాత పల్చటి గుడ్డలో వడపోయాలి. ఇదే నీమాస్త్రం. దీన్ని ఒక డ్రమ్ములో నిల్వచేసుకోవాలి. ఈ ద్రావణాన్ని నీటిలో కలపకుండా నేరుగా పంటలపై సాయంత్రం పూట పిచికారీ చేసుకోవాలి. వారం లోపు వాడేసుకోవాలి.

News December 24, 2025

అనంతపురం జిల్లాలో 92 పోస్టులకు నోటిఫికేషన్

image

AP: అనంతపురం జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ & సాధికారత అధికారి కార్యాలయం 92 <>అంగన్‌వాడీ<<>> కార్యకర్తలు, హెల్పర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ పాసై, 21-35ఏళ్లు ఉన్న స్థానిక మహిళలు నేటి నుంచి డిసెంబర్ 31వరకు అప్లై చేసుకోవచ్చు. అంగన్‌వాడీ కార్యకర్తకు నెలకు రూ.11,500, హెల్పర్‌కు రూ.7000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in/

News December 24, 2025

కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ ఫొటో

image

క్రిస్మస్ పండుగ సందర్భంగా పులివెందులకు వచ్చిన వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటో విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఫొటోను ఆయన అభిమానులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఫొటోలో విజయమ్మ, దివ్యారెడ్డి, భారతి రెడ్డి తదితర కుటుంబ సభ్యులు ఉన్నారు.