News March 30, 2025
విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

వేసవిలో ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా నరసాపురం(NS), కర్ణాటకలోని అరిసికెరె(ASK) మధ్య స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 6 నుంచి మే 25 వరకు ప్రతి ఆదివారం NS- ASK(నెం.07201), ఏప్రిల్ 7 నుంచి మే 26 వరకు ప్రతి సోమవారం ASK- NS(నెం.07202) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Similar News
News April 1, 2025
విజయవాడ: ‘పేదల భద్రతే ప్రభుత్వ లక్ష్యం’

ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పేదలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తామని, ఇంటివద్దే పింఛన్ల పంపిణీతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని జిల్లా ప్రత్యేక అధికారి జి. జయలక్ష్మి తెలిపారు. మంగళవారం విజయవాడ రూరల్, గొల్లపూడి రెండో సచివాలయంలో పింఛన్ల పంపిణీని పరిశీలించారు. జిల్లాలో 2,28,813 లబ్ధిదారులకు రూ. 98.11 కోట్లు పంఛన్లు పంపిణీ చేసినట్టు తెలిపారు.
News April 1, 2025
అత్యంత ఖరీదైన చాక్లెట్.. 50gmsకి రూ.3.2లక్షలు

చాక్లెట్ను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. కొందరికైతే అత్యంత ఖరీదైన, అరుదైన చాక్లెట్స్ తినాలనే కోరిక ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన చాక్లెట్ ‘To’ak’ గురించి మీకు తెలుసా? ‘To’ak’ 50gms బార్ ధర $3,850 (సుమారు రూ. 3.29లక్షలు). ఏంటి షాక్ అవుతున్నారా? దీనిని అరుదైన, పురాతన కోకో గింజల నుంచి తయారు చేస్తారు. చేతితో తయారు చేసిన గోల్డ్ ప్లేటెడ్ చెక్క బాక్సులో పెట్టి అమ్ముతారు. అందుకే ఇంత ధర.
News April 1, 2025
కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసిన కేంద్రమంత్రి సంజయ్

కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు కేంద్రమంత్రి సంజయ్ వినతి పత్రం అందించారు. ఖేలో ఇండియా పథకంలో భాగంగా కరీంనగర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో 8-సింథటిక్ ట్రాక్, ఫ్లడ్ లైట్లు, ఓపెన్ గ్యాలరీలో క్రీడాకారులు, ప్రేక్షకుల కోసం కెనోపీ, రక్షణ కవచం ఏర్పాటు చేయాలని కోరారు.