News May 26, 2024
విజయవాడ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది వీరే

విజయవాడ నగరంలో రాజీవ్ గాంధీ పార్క్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని ఇద్దరు సంఘటన స్థలంలోని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై కృష్ణలంక సీఐ మురళీకృష్ణ స్పందించారు. మృతులు మంగళగిరికి చెందిన మునీర్ బాషా, జరీనా గా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించినట్లు తెలిపారు.
Similar News
News February 15, 2026
నాటి ‘కడలిపల్లే’ నేటి పెదకళ్లేపల్లి క్షేత్రం!

మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో కృష్ణా నది తీరాన ఉన్న శ్రీ నాగేశ్వరస్వామి ఆలయం అత్యంత ప్రాచుర్యమైన ఆలయాల్లో ఒకటి. దక్షిణకాశీగా పిలువబడే ఈ ఆలయం బౌద్ధుల కాలం నాటిదిగా చెబుతారు. బౌద్ధుల కాలంలో ఈ ప్రాంతాన్ని కడలిపల్లి అని పిలిచేవారు. ఈ ఆలయానికి ఉత్తరం వైపు కృష్ణానది ప్రవహించడం ఇక్కడి విశిష్టత. ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు.
News February 13, 2026
కృష్ణా: పాఠశాలలకు రెండో శనివారం సెలవు రద్దు.!

కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు ప్రకటించిన రెండో శనివారం సెలవును జిల్లా విద్యాశాఖ అధికారులు అనూహ్యంగా రద్దు చేశారు. DEO సుబ్బారావు సర్క్యులర్ జారీ చేస్తూ, రేపు అన్ని ప్రభుత్వ పాఠశాలలు యథావిధిగా పనిచేయాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా జిల్లా పరిధిలోని MEO, DYEOలు తమ తమ మండలాల ప్రధానోపాధ్యాయులకు సమాచారాన్ని అందజేశారు.
News February 13, 2026
కృష్ణాజిల్లా MLAల ప్రోగ్రెస్ ఇదే

కృష్ణాజిల్లా MLAలతో CM చంద్రబాబు గురువారం సమావేశం అయ్యారు. MLAల పనితీరును బట్టి వారికి ప్రోగ్రెస్ రిపోర్టులు అందించారు. పనితీరులో పామర్రు ప్రథమ స్థానం, పెనమలూరు రెండో స్థానంలో ఉందన్నారు. నియోజకవర్గాల్లో జనసేన, BJP నేతలతో సమన్వయం పెంచాలన్నారు. అవనిగడ్డలో TDP, జనసేన మరింత కలిసి పనిచేయాలని సూచించారు. కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ప్రజలకు చేరువగా పనిచేయాలని సూచించారు.


